అలంపూర్/వడ్డేపల్లి, మార్చి 21 : రాష్ట్రంలోని పేదలకు గులాబీ పార్టీ అండగా నిలిచిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం తనగలలో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి రవీందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తక్కెళ్లపల్లి మాట్లాడుతూ పార్టీశ్రేణులు కలిసికట్టుగా ఉంటూ బీఆర్ఎస్కు అఖండ విజయాన్ని కట్టబెట్టాలని పిలుపు నిచ్చారు. ఉత్సాహంగా పనిచేసే నాయకులే కావాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల కల్లబొల్లి మాటలను నమ్మొద్దని సూచించారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధే తిరిగి బీఆర్ఎస్ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ చల్లా మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తానని పేర్కొన్నారు.
బీ ఆర్ఎస్ పార్టీ జెండా పేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలంలోని తనగల గ్రా మంలో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు రవీందర్రావు, చల్లా వెంకట్రామిరెడ్డి హాజరవగా.. జెడ్పీ చైర్పర్సన్ సరిత, కన్జ్యూ మర్ ఫెడరేషన్ ఫోరం అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రా మన్గౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలో మేళతాళాలు, పటాకుల మోత లు, పార్టీశ్రేణులు, యువకుల కేరింతల మధ్య భారీ ఊరేగింపు మధ్య నాయకు లు సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తక్కెళ్లపల్లి మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య చిన్నపాటి పొరపొచ్చాలు ఉన్నాయన్నారు. అన్నింటినీ సరిచేసి నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయడానికే ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కలసికట్టుగా వి జయం సాధిద్దామని పిలుపునిచ్చారు. రైతుల కోరిక మేరకు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇచ్చామన్నారు. ఎమ్మెల్యే అబ్రహం, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి తనగలలో మల్లమ్మకుంట రిజర్వాయర్ కావాలని కోరారని తెలిపారు. ఈ రిజర్వాయర్ మంజూరుకు కృషి చేసి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేద్దామన్నారు. మంచి పథకాలు ఇక్కడ ఉన్నాయని, అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన చల్లా వెం కట్రామిరెడ్డి పార్టీ గెలుపునకు కృషి చేస్తారని, అందరం కలసికట్టుగా ఉంటూ రా బోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భా రీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.
అభివృద్ధే గెలిపిస్తుంది : ఎమ్మెల్యే అబ్రహం
దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు, పుష్కలంగా సాగునీరు, ఆసరా పింఛన్లు, నిరంతర విద్యుత్తోపాటు ఎన్నో పథకాలతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మొక్కల పెంపకంతో రూపురేఖలే మారిపోయాయన్నారు. పట్టణాలకు సెంట్రల్ లైటింగ్, బీటీ రోడ్లతో కొత్త సొబగులు సంతరించుకున్నాయని తెలిపారు. జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఆత్మీయంగా కలిసి ఉంటూ పార్టీ విజయానికి పాటుపడదామని కోరారు. తెలంగాణను తెచ్చిన పార్టీ మనదని, రాష్ట్రంలోనే కాదు దేశమంతటా బీఆర్ఎస్ విస్తరించడం ఖాయమన్నారు. అ నంతరం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను శిర సా వహిస్తానని చెప్పారు. రాబోయే ఎ న్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానన్నారు.
మహిళలకు అండగా.. : జెడ్పీ చైర్పర్సన్
మహిళల కోసం బీఆర్ఎస్ పార్టీ అనేక పథకాలను ప్రవేశపెట్టిందని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, పింఛన్లతోపాటు ప్ర త్యేక చట్టాలను ప్రవేశపెట్టినట్లు తెలిపా రు. గతంలో తాగునీటి కోసం లడాయి లు ఉండేవని, నేడు మిషన్ భగీరథ రాకతో శుద్ధమైన తాగునీరు సరఫరా అ వుతుందని వివరించారు. ప్రభుత్వ పథకాలను మహిళలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ను అఖండ మె జార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం కు మారుడు అజయ్కుమార్, ఎంపీపీ రజితమ్మ, జెడ్పీటీసీ కాశపోగు రాజు, ము న్సిపల్ చైర్పర్సన్ కరుణ, బీఆర్ఎస్ నాయకులు సీతారామిరెడ్డి, శ్రీనివాసులుగౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, రవిరెడ్డి, మ హిపాల్రెడ్డి, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.