కొల్లాపూర్, ఏప్రిల్ 25 : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకు లు పగటి కలలు కంటున్నారని బీఆర్ఎస్ నాగర్కర్నూ ల్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలోని ఎస్ఎం గార్డెన్లో పా ర్టీ మండలాధ్యక్షుడు రాం చందర్యాదవ్ అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభను నిర్వహించారు. కార్యక్రమానికి ఎ మ్మెల్సీ పట్నం, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ తొమ్మిదేండ్లల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తం చే యాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ స్థాపించినట్లు చెప్పా రు.
ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ తెలంగాణపై కేం ద్రం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మం డిపడ్డారు. కేంద్రం కిమ్మనకుండా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేసిందన్నారు. రెండేండ్లు కొవిడ్ ఉన్నదని, ఇప్పుడు రెండేండ్లు ఎంతో అభివృద్ధి జరిగిందని.. దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు తాను సిద్ధమని రాజకీయ ప్రత్యర్థికి సవాల్ విసిరారు. మీరు గ్రామాల్లో కాగితాలు చూపిస్తుంటే.. తాము అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొందరు సోషల్ మీడియా లో తప్పుడు కూతలు కూస్తున్నారని, దుష్ప్రచారాలపై చట్టపరంగా చర్య లు తీసుకుంటామని మాజీ మంత్రి జూపల్లిని హెచ్చరించారు. ఎన్మన్బెట్లలో వీరనాయినేని చెరువు కింద నాలుగు వేల ఎకరాలకు సాగునీటి కోసం రూ.1.05 కో ట్లు మంజూరు చేసింద ని, త్వరలో పనులు ప్రా రంభిస్తామన్నారు. రూ. 15 కోట్లతో సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి ఆల య పునర్నిర్మాణ పనులకు టెండర్లు జరిగాయని, త్వరలో పనులు చేపడుతామన్నారు. మంత్రి కేటీఆ ర్ మంజూరు చేసిన రూ.10కోట్లతో కొల్లాపూర్ ము న్సిపాలిటీలో అభివృధ్ధి పనులు చురుకుగా జరుగుతున్నాయన్నారు.
కొల్లాపూర్ కోటపై గులాబీ జెం డా ఎగరవేయాలని కోరారు. అంతకుముందు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రఘువర్ద్ధన్రెడ్డి తీర్మానాలు ప్రవేశపెట్టగా పలువురు బలపరిచారు. బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి.. జయశంకర్, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను మైనార్టీ నాయకులు స న్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు గౌరమ్మ, వెంకటరమణమ్మ, చిట్టెమ్మ, ఎంపీపీలు కమలేశ్వర్రావు, భోజ్యానాయక్, మాజీ జెడ్పీటీసీ జంబులయ్య, పార్టీ అధ్యక్షులు రాముయాదవ్, ఈదన్నయాదవ్, రవి, లా లు, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీచారి, వైస్ చైర్పర్సన్ మహిమూదాబేగం, పీయూ విద్యార్థి జేఏసీ నాయకుడు బ్రహ్మం, సర్పంచ్ దశరథంనాయక్, నాయకులు