మహబూబ్నగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి పార్టీ మార్పు ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. రెండ్రోజులుగా మీడియాలో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ సభకు ఎమ్మెల్సీ కూచకుళ్ల హాజరవడంతో కాంగ్రెస్ పార్టీని షాక్కు గురి చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరుతారనే ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఇటీవలే కూచకుళ్లతో సమావేశమయ్యారు. అలాగే క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సైతం స్పందించి ఎమ్మెల్సీ కూచకుళ్లతో సోమవారం చర్చలు జరిపారు.
చర్చలతో ఎమ్మెల్సీ కూచకుళ్ల బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారని స్పష్టమైంది. తాను పార్టీని వీడేది లేదని, అదంతా.. కట్టు కథా అని కొట్టి పారేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో చీలికలు తెచ్చేందుకు కుట్రలకు తెర లేపింది. ఇందులో భాగంగా పాత పరిచయాల మేరకు మల్లురవిని కలిసేందుకు వెళ్లిన దామోదర్రెడ్డిని పార్టీలో చేరుతున్నట్లుగా మీడియాకు లీక్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి ఊతమిచ్చింది. దీంతో కూచకుళ్ల బీఆర్ఎస్ పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే కాంగ్రెస్ నేత ఒకరు పిలిస్తే పలకరించడానికి వెళ్లానని, అంతేతప్పా పార్టీ మారడానికి కాదని తేల్చి పారేశారు. దీంతో ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి పార్టీ మారుతున్నారంటూ.. పచ్చ మీడియా కథనం అబద్ధమని తేలిపోయింది.
సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ సభకు దామోదర్రెడ్డి హాజరు కావడంతో పచ్చమీడియా కథనం అసత్యమని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీకి మధ్య విభేదాలు ఉన్నాయంటూ అసత్య కథనాన్ని ప్రచారం చేశాయి. ఇటీవల దామోదర్రెడ్డి, కాంగ్రెస్ నేతలు స్నేహపూర్వకంగా కలవడాన్ని.. పార్టీ మారినట్లుగా చిత్రీకరించి కథనాలు ప్రచురితం చేసింది. దీంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ తీసుకొని ఎమ్మెల్సీ దామోదర్రెడ్డితో చర్చలు జరిపారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని, పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. దీంతో సీఎం పర్యటనకు మంత్రి ఆహ్వానించారు. గద్వాలలో జరిగిన సీఎం సభలో దామోదర్రెడ్డి ప్రత్యక్షం కావడంతో పచ్చ మీడియా కథనం అసత్యమని తేలిపోయింది .
దామోదర్రెడ్డికి, నాగర్కర్నూల్ నియోజకవర్గంలో సముచిత స్థానం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రకటించారు. గతంలోనూ కూచకుళ్ల కుమారుడు కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగిన వెంటనే ఎమ్మెల్సీ దామోదర్రెడ్డితో మాట్లాడారు. స్వయంగా ఇంటికి వెళ్లి పలకరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని పత్రికలు బీ ఆర్ఎస్ను ఢీకొనే శక్తి ఏ పార్టీకి లేదని తేలడంతో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతున్నదని ఈ ఘటనతో స్పష్టమవుతున్నది. నాయకులు, తన అనుచరులు తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని కూచకుళ్ల అన్నట్లుగా తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ క్యాడర్లో మరింత జోష్ నెలకొన్నది.