జోగుళాంబ గద్వాల జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్, బీజేపీలు ఖంగుతిన్నాయి. సీఎం కేసీఆర్ చల్లాను ఎమ్మెల్సీని చేయడంతో సంచలనంగా మారింది. విపక్షాలు చేపట్టిన ప్రచారాలకు తెరపడడంతోపాటు బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నది. ఇక నడిగడ్డలో బీఆర్ఎస్ను ఢీకొనే శక్తి లేదని తేటతెల్లమైనది. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో చల్లా ప్రభావం ఉండడంతో విపక్షాలు ఆలోచనలో పడ్డాయి. పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు కూడా చల్లా రాకతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చల్లా వెంకట్రామిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, జెడ్పీ చైర్పర్సన్ సరితలాంటి నేతలు ఒక్కతాటిపై రావడంతో విపక్షాలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
– మహబూబ్నగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ ఎమ్మెల్యే, రాజకీయ చాణక్యుడైన చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతోనే సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ ఇవ్వడంతో నడిగడ్డలో రాజకీయం వేడెక్కింది. దీంతో విపక్షాలు చేపట్టిన దుష్ప్రచారానికి తెరపడింది. చల్లా చేరికతో ఇటు బీఆర్ఎస్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుండగా అటు కాంగ్రెస్, బీజేపీలు ఖంగుతిన్నాయి. ఇక జోగుళాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ను ఢీకొనే శక్తి లేదని తేటతెల్లమైంది. జిల్లాలోని రెండు (అలంపూర్, గద్వాల) నియోజకవర్గాల్లో చల్లా ప్రభావం ఉంది. అదేవిధంగా అలంపూర్ నియెజకవర్గంలో ఆయన ఎవరిని ప్రతిపాదిస్తే వారే అసెంబ్లీకి ఎన్నకవుతారు. 2014లో కాంగ్రెస్లో ఉన్న చల్లా అలంపూర్ నుంచి ఎలాంటి ప్రజాభిమానం లేని వ్యక్తిని ఏకంగా అసెంబ్లీకి పంపించారు. అయితే పార్టీలో తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, సొంత ఎజెండా అమలుచేయడంతో 2018లో చల్లా సైలెంట్ అయ్యారు. ఆయన అనుచరులంతా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తూ బీఆర్ఎస్ను స్థాపించడంతో అదేరోజు చల్లా వెంకట్రామిరెడ్డి ప్రగతిభవన్లో పార్టీ కండువాను కప్పుకొన్నారు. ఇది జీర్ణించుకోలేని విపక్షాలు చల్లాకు పాలమూరు ఎంపీ టికెట్ ఇస్తున్నారని, బీఆర్ఎస్ తరఫున కర్నూలులో పోటీ చేస్తారని, అలంపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆయనకు మధ్య విభేదాలున్నాయని సోషల్మీడియా వేదికగా ప్రచారం నిర్వహించారు. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ ఏకంగా ఎమ్మెల్యే కోటాలో చల్లాను ఎమ్మెల్సీగా ఏకగ్రీవం చేసి విపక్షాల నోళ్లు మూయించారు. దీంతో నడిగడ్డ రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. ఇక బీఆర్ఎస్ను ఢీకొనే శక్తి కాంగ్రెస్, బీజేపీకి లేదని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు కూడా చల్లా రాకతో కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చల్లాతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, జెడ్పీ చైర్పర్సన్ సరిత వంటి నేతలు ఏకతాపైకి రావడంతో విపక్షాలకు ముచ్చెమటలు పడుతున్నాయనడంలో సందేహం లేదు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా..
చల్లా వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకొచ్చే విషయంలో మంత్రి నిరంజన్రెడ్డి కీలకపాత్ర పోషించారు. కాగా సీఎం కేసీఆర్ సమక్షంలో చల్లా బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో నడిగడ్డ రాజకీయాలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్లో ఉన్న ఆయన అనుచరగణమంతా బీఆర్ఎస్లోకి వలస రావడం ప్రారంభమైంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వాళ్లు కూడా ఇప్పుడు కారు ఎక్కేందుకు ‘క్యూ’ కట్టారు. దీంతో బీఆర్ఎస్కు మరింత బలం చేకూరింది.
బీఆర్ఎస్తో ‘ఢీ’(కె) సాధ్యమా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్వాల జిల్లాలోని రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అందులో చల్లా హస్తం ఉండడం వల్లే అది సాధ్యమైంది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు గద్వాలను జిల్లా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని అడగకపోయినా ఇక్కడి బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తిమేరకు సీఎం కేసీఆర్ గద్వాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. ఈక్రమంలో ప్రభుత్వం చేపట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం స్ప ష్టంగా కనిపించింది. కొత్త జిల్లాలో తొలిసారి ఎ మ్మెల్యేగా గెలిచిన ఒకాయన ఏకంగా మూడు ఇండ్లు నిర్మించుకొని.. హైదరాబాద్లో బం గ్లా కూడా కట్టించుకోవడంతో ఖంగుతిన డం చల్లా వర్గీయుల వంతయింది. జి ల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలూ ప్రజలను పట్టించుకోకపోవడంతో 2018 ఎన్నికల్లో నడిగడ్డ జ నం బీఆర్ఎస్కు పట్టం క ట్టారు. అలంపూర్ ఎ మ్మెల్యేగా వీఎం అ బ్రహం, గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమెహన్రెడ్డి విజయం సాధించడంతో గద్వాల జిల్లా 2018 నుంచి అభివృద్ధిలో పరుగందుకున్నది. తాజాగా చల్లా రాకతో బీఆర్ఎస్ ను ఎలా ఢీకొనాలనే విషయమై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. చల్లా రాకతో నడిగడ్డ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్లో ఉన్న నేతలంతా ఒక్కతాటిపైకి వస్తుండడంతో కార్యకర్తల్లో రెట్టింపైన ఉత్సాహం కనిపిస్తున్నది.