మహబూబ్నగర్ అర్బన్, మార్చి 7 : వంద రోజుల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అ న్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మహబూబ్నగర్, హన్వాడ మండలాల ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెం టనే గ్రామాల్లో కరెంట్ కోతలతోపాటు తాగునీరు అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ఆరోపించారు. పంటలు ఎండుతున్నా కనీసం బోర్ల ద్వారా నీరు అందించేందుకు కరెంట్ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ లేకుండా ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో నియమించిన పరీక్షలకు ఫలితాలు ప్రకటించి, నియామక పత్రాలు అందించి తామే భర్తీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల్లో బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నదని, వచ్చే ఎన్నికల్లో గెలిపించడం ఖాయమన్నారు. అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్రెడ్డిని ప్రకటించిందని, ఆయన గెలుపునకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ మ న్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చై ర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెం కన్న, హన్వాడ ఎంపీపీ బాలరాజు, మండల అ ధ్యక్షుడు కరుణాకర్గౌడ్, నాయకులు మల్లు న ర్సింహారెడ్డి, రమణారెడ్డి, రాఘవేందర్గౌడ్, శేఖ ర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.