ఉండవెల్లి, డిసెంబర్ 11: గ్రామాలను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే విజయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని ఎస్సీకాలనీ, బీసీకాలనీలో రూ.6లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులకు ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతికాలనీకి సీసీరోడ్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్లలో గ్రామాలకు రూ.కోట్లాది నిధులను కేటాయించి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయుడు కార్తీకమాసం కావడంతో ఉండవెల్లి వెంకటరమణ కాలనీలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించకొని ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో కలుగోట్ల పీఏసీసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ దేవన్న, ఎంపీటీసీలు రాజశేఖర్, సుంకన్న, ఉపసర్పంచ్ మక్బూల్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ప్రాగటూర్ జనార్దన్రెడ్డి, రఘురెడ్డి, దామోదర్రెడ్డి పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే విజయుడు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్, నియోజకవర్గ ఏవోలు సురేఖ, రాధిక, సుబ్బారెడ్డి, చంద్రశేఖర్, ఆత్మ అధికారులు శ్రీధర్, శ్రీకాంత్తో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
వడ్డేపల్లి, డిసెంబర్ 11: బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని పైపాడు, శాంతినగర్ నుంచి సుమారు 200మందికి పైగా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే విజయుడిని కర్నూలులో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడిని గజమాలతో సన్మానించారు.
రాజోళి, డిసెంబర్ 11: రాజోళి మండలం నుంచి చేనేత శ్రామిక సేవాసమితి సభ్యులు జెడ్పీ కోఆప్షన్ నిషాక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ గెలుపునకు కృషిచేసిన కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. చేనేత శ్రామిక సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.