మక్తల్ అర్బన్, ఫిబ్రవరి 25 : సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ పనులు త్వరలోనే చేపట్టి మక్తల్, మాగనూరు మండలాలకు తాగు, సాగునీరు అందిస్తామని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నా రు.
ఆదివారం మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో వారు పూజలు చేసి లెఫ్ట్ కెనాల్ కోసం తొలగించాల్సిన బండను పరిశీలించారు. రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లెప్ట్ కెనాల్ను పూర్తి చేస్తే మక్తల్, మాగనూరు మండలాల్లోని 9గ్రామాల్లో 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
మక్తల్ టౌన్, ఫిబ్రవరి 25 : భారత్మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయి న వారికి న్యాయం చేయాలని ఆ దివారం సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచందర్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీహరికి బాధితులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రామలింగం, ప్రసాద్, నర్సింహులు, వెంకటప్ప, శేఖర్ తదితరులున్నారు.