గద్వాల, నవంబర్ 5 : ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గట్టు మండలం మిట్టదొడ్డికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ సర్పంచ్ ఉరుకుందు, ఉపసర్పంచ్ తాయన్న, వీరేశ్, వెంకటేశ్, వెంకట్రెడ్డి, నర్సింహారెడ్డితోపాటు 200మంది, ముచ్చోనిపల్లికి చెందిన గోపాల్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, నాగిరెడ్డి, కిష్టన్నతోపాటు 50మంది, పట్టణంలోని మూడవ వార్డుకు చెందిన శివరాజు, భరత్, రాహుల్, ఉదయ్, వంశీ, తరుణ్, శ్రీనుతోపాటు 30మంది, గద్వాల మండలం కొత్తపల్లికి చెందిన 80మంది, జిల్లాకేంద్రంలోని 15వ వార్డుకు చెందిన ప్రియాంక, సుదర్శన్ ఆధ్వర్యంలో గంజిపేట, సుంకులమ్మ మెట్టుకు చెందిన నాయకులు, గుర్రంగడ్డకు చెందిన 30మంది, వీరాపురానికి చెందిన 50 మంది, 6వ వార్డుకు చెందిన రవి,16వ వార్డుకు చెందిన శివ, లక్ష్మన్న, అంజి తదితరులు బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, అర్హులకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రతి ఇంటికీ ఎదో ఒక రూపంలో సంక్షేమ పథకం అందిందన్నారు. పథకాలు పొందిన వారంతా పార్టీకి అండగా నిలవాలని కోరారు. ప్రతిపక్షాలకు అధికారం ఇస్తే రాష్ట్రం మరో వందేళ్లు అభివృద్ధిలో వెనుకబడుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అమలు కాని హామీలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలు నమ్మి ఓటు వేస్తే గోస తప్పదన్నారు. పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే మరోసారి బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, వైస్చైర్మన్ బాబర్, ఎంపీపీ ప్రతాప్గౌడ్, సర్పంచులు స్వప్న, అశోక్రెడ్డి, నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, రమేశ్నాయుడు, రాధాకృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్రెడ్డి, సలాం తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీలకు తెలంగాణ సర్కారు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్హాల్లో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మున్నాబాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అ న్ని వర్గాలకు సం క్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్పొరేట్స్థాయి విద్యను అందించేందుకే మైనార్టీ గురుకులాలు ఏ ర్పాటు చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మై నార్టీల కోసం షాదీఖానాలను ని ర్మిస్తున్నట్లు వివరించారు. అ నంతరం ఎంఐఎం జిల్లా అ ధ్యక్షుడు మున్నాబాషా మాట్లాడుతూ ఎంఐఎం మాట.. బీఆర్ఎస్కు గెలుపు బాట అన్నా రు. ఎంఐఎం పార్టీ సీ ఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చుతూ బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించిందని.. అందుకోసమే ఈ సమావేశం నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఎంఐఎం పూర్తిస్థాయి మద్ధతు బీఆర్ఎస్కేనని తెలిపారు. సమావేశంలో ఎన్నికల ఇన్చార్జి రాకేశ్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.