మహబూబ్ నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నారాయణపేట రూరల్, నవంబర్ 21 : నారాయణపేటను జిల్లాను చేసినం.. మెడికల్ కాలేజ్ తెచినం.. ఓటు అడిగే ఒక్క బీఆర్ఎస్కే ఉంది.. కాంగ్రెస్ బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మన బతుకు కోసం ఓటు వేయాలి.. కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అన్నీ తుస్.. కర్ణాటకలో ప్రభుత్వం ఏం చేస్తుందో అందరికీ తెలుసన్నారు. రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ సాల్తదని చెబుతున్నాడు.. మూడు గంటలు సరిపోతాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాటలను నమ్మొద్దన్నారు. పోయిన ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా జిల్లాను చేసినం.. కలెక్టర్ ఆఫీస్ కడతున్నం.. ఎస్పీ ఆఫీస్ కడుతున్నం.. జిల్లా ఆస్పత్రి తెచ్చినం.. అప్పక్పల్లి నుంచి రోడ్డు వేస్తున్నాం.. భవిష్యత్లో ఇక్కడ జంక్షన్ చేస్తామన్నారు. మూడు గంటల కరెంట్ కావల్నా..24 గంటలు కరెంట్ కవాల్నా.. మూడు గంటలు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి, 24గంటలు కావాలంటే బీఆర్ఎస్కు ఓటెయ్యాలని కోరారు. త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి రైతుల పాదాలు కడుగుతామన్నారు. ఈ ఎత్తిపోతల పూర్తయితే ఇక్కడ ఎకరం నాలుగు కోట్లు పలుకుతుందన్నారు. భవిష్యత్లో అప్పక్పల్లి బంజారాహిల్స్లా చేస్తానన్నారు. అంతకు ముందు గ్రామంలో భారీ స్వాగతం పలికారు. పటాకులు కలుస్తూ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మ కోళ్ల శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, సర్పంచ్ వెంకటమ్మ పాల్గొన్నారు.
కోయిలకొండ, నవంబర్ 21: బీఆర్ఎస్తోనే తెలంగాణ మరింత అభివృద్ధి సాధ్యమని ఢిల్లీ పాలకుల చేతిలోకి వెళ్తే ఆగం చేస్తారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మంగళవారం శేరివెంకటాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సమక్షంలో మండలంలోని వింజమూరు, ఎల్లారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాములు, వాల్యానాయక్, భీమయ్య, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, నవంబర్ 21: మండలంలోని మొగల్మడ్క, అన్నాసాగర్లో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి మంగళవారం రోడ్షో నిర్వహించారు. అనంతరం మండంల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది వన్నడి చంద్రకాంత్ అధ్వర్యంలో ఎమ్మెల్యే ఎస్ఆర్. రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మండలకేంద్రానికి చెందిన భజన భక్త మండలి సభ్యులతోపాటు వివిధ పార్టీలవారిని బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వచ్చే సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి గురించి వివరించడంతో వారు పార్టీలోకి వచ్చారని వన్నడి చంద్రకాంత్ తెలిపారు. అంతకుముందు బాపన్పల్లిలో గజలేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సంక్షేమపథకాలు, గ్రామాల అభివృధ్ధి గురించి వివరించడంతో వారు పార్టీలోకి వచ్చారని వన్నడి చంద్రకాంత్ తెలిపారు. కార్యక్రమంలో వన్నడి సురేశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అశోక్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.