నారాయణపేట, నవంబర్ 5: బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు భరోసానిస్తుందని, ఈ పథకం ద్వారా ప్రతినెల రూ.3000 ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వ వార్డులో ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్దిని వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ బడుగు,బలహీన, మైనార్టీ వర్గాల అభ్యన్నతికి పెద్దపీట వేశారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి ఓటు వేసి అభివృద్దికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, కౌన్సిలర్లు రాజేశ్వరీ నారాయణమ్మ, శిరీష, అనిత, ఎంఐఎం కౌన్సిలర్ తఖీచాంద్, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
మరికల్ , నవంబర్ 5: బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని పార్టీ బీసీ విభాగం మండల అధ్యక్షుడు గాదం మల్లేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని మరికల్, మాధవరం, పెద్దచింతకుంట, తీలేరు, రాకొండ, పస్పుల, గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా గ్రామాలు అభివృద్ధ్ది చెందాయని, మరింత అభివృద్ధ్దికై బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు, కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీ గోపాల్, ఆయా గ్రామాల నాయకులు శ్రీనివాసులు, హన్మిరెడ్డి, రామస్వామి, రాజేశ్, కొండారెడ్డి, కృష్ణయ్య, ఉప సర్పంచ్ శివకుమార్,రామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ, నవంబర్ 5 : నారాయణ పేట నియోజకవర్గం అభివృద్ధి కోసం మరోసారి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిం చాలని బీఆర్ఎస్ మండల నాయకులు నాగేశ్వర్రెడ్డి కో రారు. ఆదివారం మండల లోనిగోటూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గోటూర్, కొండ్రొనిపల్లి గ్రామలకు బీటీ రోడ్డు వేసిన ఘనంత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే ఎస్.ఆర్ రెడ్డిదే అని అన్నారు. ప్రజ లు కారు గుర్తకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, నవంబర్ 5: మండలంలో రూ 498 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన నారాయణపేట ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించా లని బీఆర్ఎస్ నాయకులు మోహన్రెడ్డి కోరారు.ఆదివారం మండలంలోని శేరివెంకటాపూర్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కృషితో మండలం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది సాధించిందన్నారు. కార్యక్రమంలో శివరాంగౌడ్,బాలకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేటరూరల్, నవంబర్ 5: పేట మండల పరిధిలోని సింగారం, బండగొండ, భైరంకొండ చిన్నజట్రం, జిలాల్పూర్, అంత్వార్, అభంగపూర్, అప్పిరెడ్డిపల్లి, జాజాపూర్,తో పాటు తదితర గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రభు త్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను వివరించి కారుగుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. సింగారంలో మోడి ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడంతో తాము గ్యాస్పొయిలకు బదులుగా కట్టెల పొయిలను వాడుకోవాల్సి వస్తుందని మహిళలు వాపోయారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తామని హామీ ఇచ్చారని, తామంత బీఆర్ఎస్ వెంటే వెంటే ఉంటా మన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వేపూరి రాములు, రవీందర్గౌడ్,రైతు సమన్వయసమితి జిల్లా సభ్యులు కోట్ల జగన్మోహన్రెడ్డి,అలీశేర్ ఆయా గ్రామాల నాయకులు మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, హన్మంతు, కతలప్ప, రాములు ఆంజనేయులు, వెంకటప్ప, కనకప్ప, విశ్వనాథ్, కిష్టప్ప, తదితరులు పాల్గ్గొన్నారు.