కోస్గి, మార్చి 30: ఉచిత కోచింగ్సెంటర్ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తున్న నోటిఫికేషన్లకు శిక్షణ పొందేందుకు పీజేఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వన్నం పుల్లప్ప కాంప్లెక్స్లో ఏర్పాటు చేసి ఉచిత కోచింగ్సెంటర్ను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ ప్రారంభించామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు వేలరూపాయలు ఖర్చుచేసి హైదరాబాద్వంటి పట్టణాలలో శిక్షణ పొందేందుకు భారమవుతుందన్నారు. అందుకే ఉత్తమ అధ్యాపకులతో ఇక్కడే శిక్ష్షణ ఇప్పిస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఉచితంగా స్టడిమెటీరియల్ కూడా అందిస్తామన్నారు. ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష, డీసీసీబీ డైరెక్టర్ భీంరెడ్డి, ఎంపీపీ మధుకర్రావ్, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్, బాలేష్ తదితరులున్నారు.