జినేపల్లి, జూలై 13 : రాష్ట్రంలో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. మండలంలోని వట్టెం గ్రామంలో రూ.50 లక్షలతో మన ఊరు-మన బడిలో భాగంగా నిర్మించిన పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 68 లక్షలతో నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ప్ర హరీ, రూ.12 లక్షలతో నిర్మించిన యాదవ కమిటీహాల్ను గురువారం ఎమ్మెల్యే మర్రి ప్రారంభించారు. అలా గే వెల్గొండ నుంచి వట్టెం వరకు రూ.3.20 కోట్లతో ని ర్మించనున్న బీటీ రోడ్డుకు, రూ.20 లక్షలతో నిర్మించను న్న గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం చదువుకు పెద్దపీట వేస్తున్నదని, విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను క్రమశిక్షణతో విని భావిభారత పౌరులుగా ఎదగాలన్నారు. తిమ్మాజిపేట మండలకేంద్రంలో రూ.2 కోట్ల సొంత డబ్బుతో పాఠశాలను ని ర్మించామన్నారు. మరో 15 రోజుల్లో వట్టెం గ్రామంలో కూడా నూతన హైస్కూల్ నిర్మాణానికి భూమిపూజ చే స్తానన్నారు. ప్రాథమిక పాఠశాలలో రూ.50 లక్షలతో ని ర్మిస్తున్న అదనపు గదులకు మరో రూ.10 లక్షలు మం జూరు చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి వసతి కోసం తన నిధులను కేటాయిస్తానని, పనులు త్వరగా చేపట్టాలన్నారు. ప్రభుత్వ బడులపై మరింత నమ్మకం కలిగేలా తల్లిదండ్రులకు వివరించాలన్నారు. గ్రామాల్లోకి వచ్చే పగటి వేషగాళ్లను నమ్మొద్దని కోరారు.
మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరందుతుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, పిం ఛన్లు, రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ ఫథకాలు ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి కేవలం మూడు గంటల విద్యుత్ చాలనడం సరికాదన్నారు. పదవులకోసం పాకులాడే వారే తప్పా.. ప్రజలకోసం ఆలోచించే ఆలోచన ప్రతిపక్ష నాయకులకు లేదన్నారు. దేశం లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట రూ.2 వేల పింఛ న్ ఇవ్వని వారు.. తెలంగాణలో రూ.4 వేలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు మూడు గంటలు ఇస్తామని కాంగ్రెస్.. వ్యవసాయబోర్లకు మీట ర్లు బిగిస్తామని అంటున్న బీజేపీ నాయకులు కావా లా..? మూడు పంటలకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా? అనే విషయాన్ని రైతులు ఆలోచించుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆపద్బంధు పథకం కింద వచ్చే రూ. 50 వేలు అధికారుల చేతులు తడిపితే ప్రజల చేతికి సగం మాత్రమే అందేవన్నారు. కానీ బీఆర్ఎస్ సర్కారు రైతు చనిపోయిన పది రోజుల్లోనే రూ.5 లక్షలను నామినీ ఖాతాలో నేరుగా జమచేస్తుందన్నారు. రాష్ర్టాన్ని దోచుకుతినేందు కు ప్రతిపక్ష నాయకులు అధికారం కోసం తహతహలాడుతున్నారన్నారు. గృహలక్ష్మి పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామని, సొంతజాగా ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 3 లక్షలు అందజేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో రూ. కోటితో ఎకరా స్థలంలో యాదవ కమిటీహాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, సింగిల్విండో చైర్మన్ బాలరాజ్గౌడ్, తిరుపతిరెడ్డి, మహేశ్వర్రెడ్డి, పులేంధర్రెడ్డి, బాలస్వామి, కు ర్వమ్మ, అమృత్రెడ్డి, పర్వతాలు తదితరులున్నారు.