తిమ్మాజిపేట, మే 14 : ఛత్రపతి శివాజీకి దేశంలోనే విశిష్టస్థానం ఉందని, ఆయన సమసమాజాన్ని స్థాపించాడని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తిమ్మాజిపేటలో శివాజీ విగ్రహాన్ని ఆదివారం ఆయ న ఆవిష్కరించి మాట్లాడారు. దేశాన్ని ఎందరో రా జులు పాలించినా.. కొందరి చరిత్రే భవిష్యత్ తరాలకు చేరుతుందని.. అందులో శివాజీ అగ్రభాగంలో ఉంటారన్నారు. శివాజీ కేవలం ఒక మతానికే ప్రా ధాన్యం ఇవ్వకుండా అందరినీ సమానంగా చూశారని గుర్తుచేశారు. అన్యాయం, అత్యాచారాలపై ఉ క్కుపాదం మోపారని.. సామ్రాజ్యవాదాన్ని ఏర్పా టు చేసి దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చారన్నారు. శివాజీ, వివేకానంద, అంబేద్కర్ విగ్రహాల ద్వారా వారు చూపిన మార్గం, ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి నిత్యం గుర్తుంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. మహోన్నతుల విగ్రహాలను చూసైనా మా ర్పురావాలన్నారు.
శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని చౌరస్తాగా తీర్చిదిద్ది.. దానికి ఆయన పే రునే పెడతామన్నారు. తాను హిందూమతాన్ని గౌరవించడంతోపాటు ఇతర మతాలకూ ప్రాధాన్యం ఇ స్తానన్నారు. తిమ్మాజిపేటలో ఎకరా స్థలంలో రూ. కోటితో రామాలయాన్ని నిర్మిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షుడు మురశీమనోహర్ శివాజీ చరిత్ర, భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను వివరించారు. కార్యక్రమంలో అంబేద్కర్ పార్టీ రా్రష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ బహుద్దూర్, బీజేపీ నా యకులు దిలీపాచారి, జెడ్పీటీసీ దయాకర్రె డ్డి, వైస్ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, సర్పంచ్ వేణుగోపాల్గౌడ్, ఎంపీటీసీ లీలావతి, మార్కెట్కమి టీ డైరెక్టర్లు హుస్సేనీ, కవిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రదీప్, రైతుబంధు సమితి కన్వీనర్ వెంకటస్వామి, యువజనసంఘం ప్రతినిధులు శివ, మురళి, హన్మంతు, యశ్వంత్, ఆనంద్, మల్లేశ్, రాజు, వెంకటేశ్, అజయ్, శ్రీశైలం, తిర్మల్, యువజనసంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు తగ్గుతున్న ఇన్ఫ్లో
అయిజ, మే 14 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో తగ్గుతున్నది. ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 194 క్యూసెక్కులు ఇన్ఫ్లో చేరుతున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 229 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, దిగువకు 218 క్యూసెక్కులు పారుతున్నట్లు చెప్పారు. ఆనకట్టలో ప్రస్తుత నీటినిల్వ 7 అడుగులు ఉందని ఆయన తెలిపారు. అలాగే తుంగభద్ర డ్యాంన కు 1,960 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతుండగా, అవుట్ ఫ్లో 215 క్యూసెక్కులు గా నమోదైనట్లు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. ప్రస్తుత నీటినిల్వ 3.306 ఉన్నట్లు పేర్కొన్నారు.