జడ్చర్ల, నవంబర్ 30 : జడ్చర్ల నియోజకవర్గం లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో దాదాపు 81.18 శాతం పోలింగ్ నమోదైం ది. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 2,20,244 మం ది ఓటర్లు ఉన్నారు. అందులో 1,10,783 మంది పురుషులు, 1,09,456 మంది మహిళ ఓటర్లు, ఐదుగురు ఇతరులు ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 274పోలింగ్ కేంద్రాలు ఉన్నా యి. అందులో జడ్చర్ల మండలంలో 103, బాలానగర్ మండలంలో 39, నవాబ్పేట మండలం లో 53, మిడ్జిల్ మండలంలో 31, రాజాపూర్ మండలంలో 26, ఊర్కొండ మండలంలో 22 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే ఈవీఎంలు మోరాయించడం, పోలింగ్ బూత్ల్లో ఓటర్ల సం ఖ్య ఎక్కువగా ఉండడంతో నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో రాత్రి 9:30గంటల వర కు పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 5 గంటలోపు పోలింగ్ స్టేషన్ బౌండరిలో ఉన్నవారందరికీ ఓట్లు వేసేందుకు అధికారు లు అనుమతించారు. దాంతో చాలా పోలింగ్ కేం ద్రాల్లో రాత్రి వరకు పోలింగ్ జరిగింది. జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల మండలం ఉదండాపూర్, కోడ్గల్, జడ్చర్ల బాలికల కళాశాలలో, రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ, రాజాపూర్, తిర్మలాపూర్, ఈద్గాన్పల్లి, నవాబ్పేట మండలంలోని యన్మన్గండ్ల, లోకిరేవు, మిడ్జిల్ మండలంలోని బోయిన్పల్లి, ఊర్కొండ మండలంలోని బొమ్మరాసిపల్లి, జగబోయిన్పల్లి గ్రామాల్లో సాయంత్రం 5 గంటల తర్వాతకూడా పోలింగ్ కొనసాగింది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రవినాయక్ పరిశీలించారు.
జడ్చర్ల/జడ్చర్లటౌన్, నవంబర్ 30 : జడ్చర్ల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జ డ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్, ఉ ర్కొండ, బాలానగర్, రాజాపూర్, నవాబ్పేట మండలాల్లో మొత్తం 274 పోలింగ్ కేంద్రాలు ఉండగా, నియోజకవర్గంలో మొత్తం 2,20,244 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వాహణకు మొత్తం 1300 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల బందోబస్తుకు మొత్తం 800 మంది పోలీసు సిబ్బందిని తెలంగాణతో పాటు కర్నాటక, ఉత్తరప్రదేశ్, జార్ఖాండ్ రాష్ర్టాలకు చెందిన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటలకు పోలింగ్ భూత్ల వద్ద ఓటర్లు క్యూకట్టారు. జడ్చర్ల మండలంలోని 185 పో లింగ్ కేంద్రంలో ఈవీఎం మిషన్ మొరయించగా వెంటనే పోలింగ్ అధికారులు టెక్నికల్ సిబ్బందిని పంపించి సరిచేశా రు. కోడుగల్లో పో లింగ్ కేంద్రం వద్ద మహిళ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వారిని క్యూలో నిలబెట్టేందుకు పోలీసులు ఇబ్బందిపడ్డారు. బాదేపల్లిలో 186వ పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల బందోబస్తుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేయటాన్ని బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ జోరుగా సా గింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. సాయంత్రం 5గంటలోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిలుచు న్న ఓటర్లకు పోలింగ్ సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. సాయంత్రం ఏడు గంటల వరకు కూడా జడ్చర్ల, రాజాపూర్, మిడ్జిల్, నవాబ్పేట మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టారు.
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్లలోని సెయింట్ ఆగ్నేస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబ స భ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అ నంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విలేకరులతో మా ట్లాడి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్ తీరు పై స్థానిక బీఆర్ఎస్ నాయకులతో అడిగి తెలుసుకున్నారు.
ఉత్సాహంగా పాల్గొన్న కొత్త ఓటర్లు
18 ఏండ్లు నిండిన యువతి, యువకులు మొదటి సారి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓట ర్ స్లిప్లను చేతబట్టుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకున్నామంటూ కొత్త ఓటర్లు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పట్టణాల్లో స్థిరపడ్డ వారు తమ కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొన్నారు.
రాజాపూర్లో..
రాజాపూర్, నవంబర్ 30 : గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారులు మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 26 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 24 గ్రామ పంచాయతీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు ప్రశాంత జరిగాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఓటర్లు ఉదయం నుంచే బూత్ల భారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు మండల కేంద్రంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, తిర్మలాపూర్ గ్రామంలో మహిళ పో లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో 24 గ్రామాల్లో 21,964 ఓట్లు ఉన్నాయి. ఇందులో 10,984 పురుషులు, 10,980 మహిళ ఓటర్లు ఉన్నారు.
ఎన్నికలు ప్రశాంతం
మిడ్జిల్, నవంబర్ 30 : మండలంలోని అసెం బ్లీ ఎన్నికల పోలింగ్ ముగిస్తుంది. చిన్నచిన్న ఘటనలు మీనహా ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా త మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మం డలంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ పటిష్టమైన బందోబస్తు నిర్వహించినట్లు సీఐ జములప్ప తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు వీల్చైర్లను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో తొలి సారి యు వకులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్ని ఓటు వేశారు. మండలం మొత్తం 24,257 మంది ఓటర్లకు గానూ 79శాతం పోల్ అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
నవాబ్పేటలో..
నవాబ్పేట, నవంబర్ 30 : నవాబ్పేట మండలంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 42 గ్రామ పంచాయతీలకు గానూ 53 పోలింగ్ బూత్ల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగింది. గ్రామాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి గురుకుంటలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా యన్మన్గండ్లలోని 30వ పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్ మొరాయించడంతో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. అలాగే లోకిరేవు, కాకర్లపహాడ్ గ్రామాల్లో కూడా రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. మిగ తా మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పో లింగ్ ప్రశాంతంగా కొనసాగినట్లు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మల్లికార్జునరావు తెలిపారు.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
బాలానగర్, నవంబర్ 30 : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో అంసెబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారులు మండలంలోని 37 గ్రామ పంచాయతీ పరిధిలోని 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలో ఎక్కడ ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల సంఘం అధికారులు మండలంలోని నేరళ్లపల్లిలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని గుండేడ్లో మహిళ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని మొత్తం 32,423 ఓట్లు ఉన్నాయి, ఇందులో పురుషులు 16,540, మహిళలు 15,882 ఓట్లరు ఉన్నారు. అదేవిధంగా కేతిరెడ్డిపల్లిలో జెడ్పీటీసీ జర్పుల కల్యాణి దంపతులు ఓటును వినియోగించుకున్నారు. అలాగే పోచమ్మగడ్డతండాలో పోలింగ్ కేంద్రాన్ని జీసీసీ చైర్మన్ వాల్యానాయక్ పరిశీలించారు.
పీయూకు చేరిన ఈవీఎంలు
మహబూబ్నగర్, నవంబర్ 30 : ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు ఈవీఎంలను పాలమూరు యూనివర్సిటీలోని ఆయా నియోజకవర్గలకు సంబంధించిన గదులలో ఉంచడం జరిగిం ది. ఈ మేరకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటు నిరంతరం బందోబస్తును పకడ్బందీగా ఉండనున్నది. ఈ నెల 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉన్న విషయం విధితమే.