జడ్చర్ల, మే 29 : డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకం గా చేపడుతున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 18, 19 వార్డుల్లో సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబాల స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంతిల్లు, స్థలం లేకుండా అద్దె ఇండ్లల్లో నివాసముంటున్న పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే సొంత స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకంతో రూ.3లక్షలు మంజూరు చేస్తామన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మార్కె ట్ కమిటీ వైస్చైర్మన్ దానిశ్, కౌన్సిలర్లు రఫీక్, ప్రశాంత్రెడ్డి, నవనీతాకొండల్, చైతన్య, నాయకులు ఇఫ్తేకారొద్దీన్, మురళి, రామ్మోహన్, రవీందర్, అజార్, దామోదర్, మెకానిక్ సత్యం, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహమూద్షేక్, ఆర్ఐ రాఘవేంద్ర పాల్గొన్నారు.