రాజాపూర్, ఏప్రిల్ 16: దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆపదొస్తే ప్రభు త్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుచ్చర్కల్ గ్రామంలో రెండురోజుల కిందట కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇండ్లు, వరి పంటలను ఆదివా రం పరిశీలించారు. చేతికొచ్చిన పంట అకాల వర్షానికి నెలపాలు కావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కుచ్చర్కల్, రాజాపూర్, రాయపల్లి, చెన్నవెల్లి గ్రామాల్లో దాదాపు 200ఎకరాల పంటనష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పంటనష్టంపై సీఎం కేసీఆర్తో చర్చించి రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు.
ఇండ్లు దెబ్బతిన్న వారికి డబుల్ ఇండ్లు
వడగండ్ల వాన, ఈదురుగాలులకు ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు కొత్తగా వచ్చే డబుల్బెడ్రూం స్కీం ద్వారా రూ.3లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మండలంలో ఇండ్లులేని నిరుపేదలకు కూడా డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీసీఎంఎ స్ జిల్లా చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్, ఏవో నరేందర్, ఆర్ఐ ఖదీర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షు డు శ్రీశైలంయాదవ్, సర్పంచులు బచ్చిరెడ్డి, సుధారాణి, ఎంపీటీసీ అ భిమన్యురెడ్డి, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, మండల కోఆప్షన్ స భ్యుడు అల్తాఫ్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.