గద్వాల, మార్చి 21 : డీకే అరుణ గద్వాలకు పొలిటికల్ టూరిస్ట్ అని.. ప్రజలు ఎక్కడ తనను మరచిపోతారనే ఉద్దేశంతో ఉనికిని కాపాడుకోవడానికి జిల్లాకు అప్పుడప్పుడు వచ్చి అభివృద్ధిపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంటుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కా ర్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గ తంలో వారు చేసిన తప్పిదం వల్లే ప్రస్తుతం చిన్నోనిపల్లి నిర్వాసిత రైతులు ఇబ్బందులు పడుతున్నారని వి మర్శించారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చిన్నోనిపల్లి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దు య్యబట్టారు. ఈ రిజర్వాయర్ పనుల విషయంపై అ రుణ మాట్లాడుతుంటే ‘దెయ్యాలు వేదాలు వల్లించిన ట్లు’ ఉన్నదని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చిన్నోపల్లి రిజర్వాయర్కు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. నాడు రైతులపై లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింద ని ప్రశ్నించారు.
అప్పుడు వారి కమీషన్ల కోసం రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చు ట్టారని తెలిపారు. పనులు చేస్తు న్న సమయంలో అరుణ భర్త భ రతసింహారెడ్డి కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించడంతో వారు పనులు చేయకుండా పో యారని గుర్తు చేశారు. నాడు ప నులు అడ్డుకున్న సమయంలో జైలుకు ఎవరు వెళ్లారో సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. వారి కమీషన్ల కక్కుర్తితోనే నేడు చిన్నోనిపల్లి రైతులకు ఈ దుస్థితి పట్టిందన్నారు. రిజర్వాయర్ను రద్దు చేయాలని ప్రస్తుతం మాట్లాడేవారు ఆనాడు ఎందుకు నిర్మించారని నిలదీశారు. రాబోయే రోజులకు ఉపయోగపడాలనే మంచి ఆలోచనతో ప్రభుత్వం రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తుంటే రాజకీయ భవిష్యత్ కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటాం.. వారికి పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. డీకే అరుణకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వి నియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ బలిగేరి ప్రాంతంలోని పలకలకుంట వద్ద రిజర్వాయర్ను నిర్మించి ఉంటే ఈనాడు చిన్నోనిపల్లి రైతులకు కష్టాలు ఉండేవి కావన్నారు. సమావేశంలో ఎం పీపీ విజయ్కుమార్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, నాయకులు రమేశ్నాయుడు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.