ఊట్కూర్/మాగనూరు, ఏప్రిల్ 4 : రానున్న ఎన్నిక ల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు రెట్టింపు మెజార్టీ ఖాయమని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ధీ మా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నా రు. మాజీ జెడ్పీటీసీ సరిత ఫాంహౌస్లో మంగళవారం మాగనూరు మండల బీఆర్ఎస్ నాయకులతో పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కశిరెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో ఎటు చూసినా బీడు భూములే కనిపించేవన్నారు. స్వరాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసుకుని 10 లక్షల ఎకరాలకు సాగునీరిందిస్తున్నట్లు తెలిపారు. రైతు లు, కార్మికులు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలను కళ్లారా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిరంతర విద్యుత్ సరఫరాతో సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. కాం గ్రెస్ నాయకుల కోర్టు కేసులతోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో జాప్యం జరిగిందని, మరో ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తామన్నారు. ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్ స్థా నంలో ఉందన్నారు. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మంత్రి కేటీఆర్ కృషితో నియోజకవర్గంలో 10 రైస్ మిల్లులు, 5 జిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేయడంతో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసుకునే అవకాశం లభించిందన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. విద్యార్థుల ఉన్నత చదువుకు ఆటంకం లేకుండా నారాయణపేట సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాలను ప్రభుత్వపరం చేయించి 50 మం దికి ఉద్యోగ అవకాశం కల్పించామనారు. ఎన్నికల్లో పోల్ చిట్టీలు పంచి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నానని, కార్యకర్తల కృషి, నియోజకవర్గ ప్రజల అండతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు తెలిపారు. ఈ సారి లక్ష మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశా రు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన నరేం ద్ర మోదీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దేవుడని వర్ణించడం సిగ్గు చేటన్నారు. ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప మాట్లాడుతూ క్యాడర్, లీడర్ లేడని, కాంగ్రెస్కు ఓట్లు లేవన్నారు. అనంతరం ఏడేండ్లపాటు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా ఉన్న ఎల్లారెడ్డిని ఎమ్మెల్సీ కశిరెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు, జెడ్పీటీసీ వెంకటయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్టి, నాయకులు ఈశ్వర్ యాదవ్, నేతాజీరెడ్డి, మధుసూదన్రెడ్డి, సర్పంచులు రాజు, రామస్వామి, నర్సింహులు, అశోక్ గౌడ్, నిర్మల, మారుతి, మంజుల, రాఘవేంద్ర, పద్మ మ్మ, జానకమ్మ, వెంటేశ్వరమ్మ, జయప్రద, శ్రీధర్ రెడ్డి, అంజమ్మ, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.