కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి, మే 30: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గణేశ్రావు అధ్యక్షతన మంగళవారం మండలస్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. ఎమ్మెల్యే బీరం, గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. మనమంతా ఒక కుటుంబసభ్యులమని.. సీఎం కేసీఆర్ మన ఇంటి పెద్ద అని ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. రెండేండ్ల కరోనా కాలంలో ఇబ్బందిపడ్డామని.. వివిధ పరిస్థితులను అన్వేషించి కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను సీఎం కేసీఆర్తో ద్వారా మంజూరు చేయించుకున్నామని చెప్పారు. చిరకాల వాంఛ అయిన కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా నంద్యాల వరకు జాతీయ రహదారి, కృష్ణానదిపై ఐకాన్ వంతెన మంజూరు కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. కొల్లాపూర్కు మామిడి మార్కెట్, ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరు చేయించిన విషయాన్ని ఎమ్మెల్యే వివరించారు. కొల్లాపూర్ అభివృద్ధికి సీఎం సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతిపక్షాల పాత్ర ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయక్వంలోని ప్రభుత్వం రైతుపక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు.
అందరూ ఏకతాటిపైకి వచ్చి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని.. అందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాని.. అందుకోసం గ్రామాల్లో రచ్చబండల వద్ద చర్చపెట్టాలని సూచించారు. హనుమంతుడి గుడి లేని ఊరు.. కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఊరు.. రెండూ లేవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో సొంత అవసరాల కోసం రైతులను విస్మరించి.. నేడు రాజకీయ ఉనికి కోసం అన్నదాతల సమస్యల పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని మాజీ మంత్రి జూపల్లిని ఉద్దేశిస్తూ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా కొల్లాపూర్ నియోజకర్గానికి ఏడు రెసిడెన్సియల్ పాఠశాలలు వచ్చాయని.. ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవమై ఇంటికి చేరే వరకు అంతా ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. మండలంలో 484మందికి మెరుగైన వైద్యం కోసం సీ ఎంఆర్ఎఫ్ కింద రూ.కోటీ 99లక్షలు మంజూరు చేసినట్లు బీరం వివరరించారు. గతంలో స్వార్థం కోసం ఎంజీకేఎల్ఐ కెనాల్స్ డిజైన్ మా ర్చేసి నీటి సామర్థ్యాన్ని తగ్గించిన ఘనుడు ఆ పెద్దమనిషి (జూపల్లి) అని ఎమ్మెల్యే విమర్శించారు. అరాచకశక్తుల చేతుల్లో కొల్లాపూర్ను ప డనీయమని, ప్రశాంత వాతావరణంలో ప్రజ లు మనుగడ కొనసాగిస్తున్నారన్నారు.
కేసీఆర్ ప్రధాని కావాలని..
దేశానికి భావి ప్రధాని కేసీఆర్ కావాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ వెల్లడించారు. పీఎంగా కేసీఆర్ ఉంటే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ తమ రాష్ర్టాల్లో విస్తరింపచేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. తొమ్మిదేండ్లుగా పని లేని బీజేపీ, కాంగ్రెసోళ్లు బీఆర్ఎస్ పార్టీ సభలు పెట్టుకుంటే.. వారి జేబుల్లో పర్సులు కొట్టే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు గెలిచి విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజాయితీపరుడు, దమ్మున్న ఎమ్మెల్యే బీరాన్ని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పథకాలను సాయిచంద్ పాట రూపంలో వివరించి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈక్రమంలో ముష్టిపల్లికి చెందిన విద్యార్థి శ్రీరాములును సాయిచంద్ స్టేజ్ మీదకు పిలిచి ఆరా తీయగా తనకు అమ్మానాన్న లేరని తెలిసింది.
దీంతో విద్యార్థిని గురుకులంలో చదివిస్తానని చెప్పాడు. అందుకు ఎమ్మెల్యే స్పందించి తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. సమ్మేళనంలో కవి ఎదురపల్లి కాశన్న ఎమ్మెల్యే వ్యక్తిత్వం, మంచి తనంపై రాసిన పాట పాడి వినిపించారు. అదేవిధంగా ఉదయ్ కళాబృందం ఆటపాటలతో అలరింపజేశారు. కాగా సమ్మేళనంలో సాయిచంద్ పాట పాడుతుండగా.. ఎమ్మెల్యే బీరం వేదిక దిగొచ్చి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సభికులను ఉత్తేజపర్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్రెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ కిషన్నాయక్, జెడ్పీటీసీ గౌరమ్మ, జెడ్పీ కోఆప్షన్సభ్యుడు మతీన్ అహ్మద్, ఎంపీపీ భోజ్యానాయక్, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్రావు, మాజీ జెడ్పీటీసీలు వెంకటయ్యయాదవ్, రాజేందర్గౌడ్, సింగిల్విండో చైర్మన్ విజయరామారావు, వైస్చైర్మన్ రాముయాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, రాజేశ్, జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ కోడేరు మండల అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, శ్రీధర్రెడ్డి, మార్కెట్కమిటీ మాజీ డైరెక్టర్ పరమేశ్, నర్సింహ్మ, ఎంపీటీసీ రేణుక, ప్రతాప్రెడ్డి, అశోక్రెడ్డి, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.