ఊర్కొండ, నవంబర్ 25 : కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధి, సంక్షేమాన్ని అందించే బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రాచాలపల్లి, ఊర్కొండపేట, జకునాలపల్లి, నర్సంపల్లి, ఇప్పపహాడ్, రాంరెడ్డిపల్లి, జగబోయినపల్లి, గుడిగాన్పల్లి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ను నమ్ముకుంటే అంధకారంలోకి వెళ్లడం ఖాయమని, బీఆర్ఎస్ను గెలిపిస్తేనే ప్రజలకు సుస్థిర పాలన అందుతుందని వివరించారు.
మరోసారి అధికారంలోకి వస్తే రైతుబంధు, ఆసరా పింఛన్లు రెట్టింపు చేయడంతోపాటు మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా రూ.3వేలు చెల్లిస్తామని, రూ.400లకే సిలిండర్ అందించడంతోపాటు మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జనార్దన్రెడ్డి, గోపాల్రెడ్డి, వైస్ఎంపీపీ అరుణ్కుమార్రెడ్డి, రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరారెడ్డి, గిరినాయక్ తదితరులు పాల్గొన్నారు.