ఊట్కూర్/ మక్తల్ టౌన్, నవంబర్ 30 : మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గవరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా ఊట్కూర్ మండలం పెద్దజట్రం, నిడుగుర్తి, పెద్దపొర్ల, ఆత్మకూర్ మున్సిపల్ కేంద్రంలోని 207, 208 పోలింగ్ కేంద్రాలు, నర్వ మండలంలోని పాతర్చేడు, పెద్దకడ్మూర్, లంకాల, మాగనూర్ మం డలంలోని వడ్వాట్ గ్రామాల్లో రాత్రి 7 గంటలు దాటినా పోలింగ్ కొనసాగింది. గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఆ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు దీరారు. నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 9. 67 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 11 గంటల వరకు 24.56 శాతం, సాయంత్రం 5 వరకు 69.21 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కేంద్రాల వద్ద అధికారులు మౌలిక వసతులను కల్పించారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సందర్శించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగులు ప్రత్యేక వీల్ చైర్ల సహాయంతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును విని యోగించుకున్నారు. కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువతీ, యువకులు ఉత్సాహంగా ఓటు వేశారు. ఊట్కూర్, మొగ్దుంపూర్, పులిమామిడి, బిజ్వారం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ అబ్జర్వర్ డీఐజీ ధ్రువ్ పరిశీలించారు.
నర్వ, నవంబర్ 30: మండలంలో 78 శాతం పోలింగ్ నామోదైనట్లు తాసీల్దార్ మల్లారెడ్డి తెలిపారు.
మాగనూరు నవంబర్ 30 మక్తల్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నదని ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ తెలిపారు. గురువారం అదనపు కలెక్టర్ మండలంలోని 64, 65, 66, 67 మోడల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ ప్రక్రియ తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
కృష్ణ, నవంబర్ 30 : మండలంలో 29 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నం సమయానికి పుంజుకుంది. మండలంలోని ఓటర్లు 21,968 ఉండగా సాయంత్రం వరకు మొత్తం 15, 418 మంది ఓటు హక్కు వినియోగించకున్నారు.
ఆత్మకూరు, నవంబర్ 30: మండలం 79.4 శాతం ఓటింగ్ నమోదయ్యిందని అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని పోలింగ్బూత్లలో మందకొడిగా సాగింది. మధ్యా హ్నం 3 గంటల వరకు మండలం వ్యాప్తంగా 58శాతం పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5 గంటలు దాటినా జూరాల గ్రామం 199, 190, మేడెపల్లి 206, దేవరపల్లి 205, ఆత్మకూరు జూనియర్ కళాశాలలోని 207, 208 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరారు. 207 పోలింగ్ బూత్లో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల పోలింగ్బూత్లను సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. సీఐ కే.ఎస్. రత్నం, ఎస్ఐ శ్రీహరి ఆద్వర్యంలో అన్ని పోలింగ్ బూత్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
అమరచింత, నవంబర్ 30: మండలంలోని మొత్తం 26 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పశ్రాంతంగా జరిగింది. మున్సిపాల్ చైర్పర్సన్ మం గమ్మ అమరచింత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయగా, ఎంపీపీ మాలతీ ఈర్లదిన్నె పోలింగ్ బూత్లో ఓటు వేయగా, అమరచింత జడ్పీటీసీ సరోజ మండలంలోని పాంరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయగా హైదార్బాద్ రెంజ్ ఐజీ రమేశ్రెడ్డి సొంత గ్రామం మాస్తీపూర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన పయువతీ, యువకులు ఉత్సాహంగా ఓటు వేసి సంతోషం వ్యక్తం చేశారు.