కృష్ణ, నవంబర్ 3 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కుసుమూర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మాట్లా డారు. ముందుగా గ్రామంలోని శ్రీకృష్ణద్వయాపాయ తీర్థుల స్వామి ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలు నిరు పేద లకు మరింత లబ్ధి చేకూరుస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి అధిక మెజార్టీతో గెలిపించా లని కోరారు. బీఆర్ఎస్ మండల నాయకులు మాట్లా డుతూ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణ మండలంలోని గ్రామాలన్ని అభివృద్ధి పథంలో నడుస్తు న్నాయన్నారు. ఎమ్మెల్యే చిట్టెంను మూడోసారి భారీ మెజార్టీతో గెలింపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు విజయ్పాటిల్, మండల ప్రధాన కార్యదర్శి మోనేశ్, నాయకులు రాజుల ఆశిరెడ్డి, సర్పంచ్ రేణుక, నాయకులు శివరాజ్పాటిల్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, సింగల్ విండో డైరెక్టర్ విజయ్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ఖదీర్, నాయకులు రామకృష్ణ ధణి, సంతోశ్, అమరేశ్, ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ అర్బన్, నవంబర్ 3: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధుకు రాంరాం, కరెంట్కు కటకట తప్పదని బీఆర్ఎస్ నాయకుడు చిట్టెం రామ్మోహన్రెడ్డి కుమారుడు చిట్టెం చాణిక్య రెడ్డి అన్నారు. శుక్రవారం మక్తల్ పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్స్లర్లు, వార్డు ఇన్చార్జిలతో కలిసి ఆయన ప్రచారం చేశారు. 12వ వార్డు షరీఫీ మసీద్ దగ్గర నమాజ్ అనంతరం ముస్లీంలను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ చేరాయన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామన్న పట్టణం ఎంతో అభివృద్ధి చెం దిందని అది గమనించి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్వర్హుస్సేన్, జగ్గ లి రాములు, మొగులప్ప, జుట్ల మారుతి, రాధిక, సాదిక్, మజర్, అంజప్ప, సాగర్, కర్రెం కృష్ణ, జగ్గలి కతలప్ప, కర్రెం భాస్కర్, బాలప్ప, అంజప్ప, మల్లేశ్ పాల్గొన్నారు.
మక్తల్, నవంబర్ 3: పట్టణంలోని 1,3,5,9,10 వార్డుల్లో శుక్రవారం కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీచర్స్ కాలనీ, కేశవనగర్ తదితర కాలనీల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, కౌన్సిలర్లు జగ్గలి రాములు, విష్ణువర్ధన్రెడ్డి, మొగులప్ప తదితరులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు శివారెడ్డి, బండారి ఆనంద్, కర్రెం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మక్తల్టౌన్, నవంబర్ 3: మండల పరిధిలోని పారేవు లలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. ప్రజలెవ్వరూ ఓట్ల పండుగప్పుడు మాత్రమే వచ్చేవారి మాటలు నమ్మకుండా చిట్టెం రామన్న విజయానికి తోడ్పానందిద్దామని పేర్కొన్నారు. కార్యక్ర మంలో ఎంపీటీసి ఆశిరెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.