మక్తల్ టౌన్, నవంబర్ 28 : కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగమైందని మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మక్తల్ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రజలకు అభివాదం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ రోడ్షో నందినినగర్, యాదవనగర్, మారుతీనగర్, నేతాజీనగర్, గాంధీచౌక్, రెడ్డి నగర్, ఆజాద్నగర్ మీదుగా అంబేద ర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడు తూ కాంగ్రెస్ 58ఏండ్లలో చేయని అభివృద్ధిని కేసీఆర్ పదేండ్లలోనే చేసి చూపించారని తెలిపారు.