అమరచింత, సెప్టెంబర్ 25 : తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేనేత రంగానికి పునర్జీవం పోశారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. చేనేతను ఆదుకునేందుకు చేనేత మిత్ర పథకంతో వారికి ముడిసరుకులు 50శాతం సబ్సిడీతో అందజేయడమే కాకుండానేతన్న కుటుంబంలో ఎవరైనా అకాల మృతి చెందిందే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు నేతన్న బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. సోమవారం జౌళీశాఖ ఆధ్వర్యంలో అమరచింత చేనేత క్లస్టర్ పరిధిలోని రూ.27లక్షలతో ఫ్రేమ్ లూమ్స్ మగ్గాల మెటీరియల్ మం జూరు కాగా ఎమ్మెల్యే చేతులు మీదుగా 104మంది కార్మికులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత క్లస్టర్ పరిధిలో మొత్తం 236 జీయో ట్యాగ్ నెంబర్ కలిగిన మగ్గాలు ఉండగా మొదటి విడుతలో 104 మందికి మంజూరయ్యాయని, త్వరలో మిగిలిన వారికీ అందజేస్తామని ప్రకటించారు. నేత కార్మికులకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందే తడువుగా చేనేత జౌళీశాఖ మంత్రి కేటీఆర్ చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నలకు రూ.3 వేల నగదును అందిస్తామని చెప్పిన ఇరవైరోజులకే అకౌంట్లలో జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం అందించిన ఫ్రేమ్ లూమ్స్ మగ్గాలను సద్వినియో గం చేసుకొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అమరచింతకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జౌళీశాఖ అధికారులు పూల మొక్కతో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెంకు స్వాగతం పలికగా చేనేత కార్మికులు నూలు దారంతో తయారు చేసిన శాలువతో ఆయ న్ను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జౌళీశాఖ గద్వాల, వనపర్తి జిల్లాల సంచాలకులు గోవిందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, చేనేత సహకర సంఘం అధ్యక్షుడు మహంకాళి చంద్రమోహన్, వ్యవసాయ కమిటీ చైర్మన్ రాజు, అమరచింత తాసీల్దార్ షేక్చాంద్పాషా, జౌళీశాఖ వనపర్తి జిల్లా సహాయ సంచాలకులు రాజేశ్వర్రెడ్డి, చేనేతే కార్మికులు రామలింగం, సత్యన్న, సోములు, రఘు, వెంకటేశ్తోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, చేనేత సహకార సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.