మక్తల్ టౌన్,అక్టోబర్ 21 : బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి పార్టీ కార్యకర్తలే పట్టుగొమ్మలన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం గుర్జాల్, మాగనూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు విజయ్గౌడ్, ఎల్లారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను ఆదరించాలని కోరారు. గత పదేండ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపానని, మరింత అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు.
ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యులుగా భావించి వారి సంక్షేమానికి కృషిచేశానన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణను ముందు వరుసలో నిలిపామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లే ని విధంగా ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను అందించామన్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, సాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి ఎమ్మెల్యేగా దొరకడం అదృష్టమన్నారు. ప్రజల మనసు గెలిచిన చి ట్టెం రామ్మోహన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎన్నికలయ్యేంతవరకు ప్ర తి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే సతీమణి చిట్టెం సుచరితారెడ్డి, జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.