ధరూరు, జనవరి 31 : కేసీఆర్ పాలనలోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. తన స్వగ్రామమై న బూరెడ్డిపల్లిలో నిర్మించిన పాఠశాలను సతీమణి బండ్ల జ్యోతితో కలిసి ఎమ్మెల్యే బండ్ల ప్రారంభించారు. ముందుగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్ర భుత్వం అన్ని విధాలా సహకరించడంతోనే విద్యాభివృద్ధి సాధ్యమైందన్నారు. పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయ న్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు మాన్పించి ప్రభుత్వ బడుల్లో చేర్పించడం అభినందనీయమన్నారు.
అన్ని మౌలి క వసతులతో పాఠశాలను నిర్మించిన జ్యోతికి కృత జ్ఞతలు తెలిపారు. సర్పంచ్ బండ్ల జ్యోతి మాట్లాడు తూ పాఠశాల నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే కు గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలిపా రు. అయితే గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని సభాముఖంగా ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మ, వైస్ ఎం పీపీ సుదర్శన్రెడ్డి, ఉప సర్పంచ్ రంగస్వామి, నాయకులు విజయ్, మహేందర్రెడ్డి, గోవింద్రెడ్డి, రఘునాథ్రెడ్డి, శంకర్రెడ్డి, రాధ, మధుమతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అల్వాల్పాడు గ్రామంలో పల్లె దవాఖాన, సెం ట్రల్ లైటింగ్ను ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకున్నదని, అందులో భాగంగానే పల్లె దవాఖానను ప్రారంభించుకున్నామని గు ర్తు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ప్రహరీ పనులను ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని కాం ట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.