ఉండవెల్లి, ఫిబ్రవరి 2 : మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే అబ్ర హం పేర్కొన్నారు. మండలకేంద్రంలో నూతన పంచాయతీ కార్యాలయం, అం గన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులను సర్పంచ్ రేఖావెంకట్గౌడ్ ఆధ్వర్యంలో గురువా రం ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రూ.25లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లు, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉండవెల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అందులో భాగంగానే రూ.15లక్షలతో పంచాయతీ భవనం, రూ.20లక్షలతో మన ఊరు-మన బడి, రూ.15లక్షలతో అంగన్వాడీ కేంద్రం, రెండు అదనపు గదులు, రూ.25లక్షలతో సీసీరోడ్లు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఉండవెల్లి మండలానికి తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయంతోపాటు పోలీస్స్టేషన్కు స్థలాలు కేట్టాయించి త్వరలో భవనాలు నిర్మిస్తామన్నారు. అలాగే బూడిదపాడు నుంచి మారమునగాల వరకు బీటీరోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అలంపూర్ నియోజకవర్గంలోని 44 బీటీ రోడ్లకు రూ.55 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే వివరించారు. అనంతరం జీవో ప్రకారం పీఈటీ నుంచి పీడీగా పదోన్నతులు కల్పించాలని పీఈటీలు భరత్కుమార్, పార్వతమ్మ, శైలజ, సింధూరాణి, శ్రీనివాస్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏలు పేస్కేల్ అమలు చేయలని, నూతన భవనం నిర్మించాలని మహిళా సమాఖ్య అధికారులు ఎమ్మెల్యే అబ్రహంకు విన్నవించారు. కార్యక్రమంలో తాసిల్దార్ వీరభద్రప్ప, ఎంపీపీ బీసమ్మ, ఇన్చార్జి ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అజయ్, వైస్ఎంపీపీ దేవన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణ, ఎంపీటీసీలు రాజశేఖర్, సుంకన్న, పంచాయతీ కార్యదర్శి అశోక్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.