మక్తల్ టౌన్, జూలై 28 : కృష్ణానదికి వరద వస్తున్న నేపథ్యంలో నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మక్తల్ మండలం పస్పుల శివారులో దత్తాత్రేయ టెంపుల్ వద్ద కృష్ణానది వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దిగువకు వస్తున్న వరదపై కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ కలెక్టర్తో పేట కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ వరద పరిస్థితులను తెలుసుకుంటున్నారన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు నదికి ఆవలి వైపు ఉన్న దత్త పీఠానికి బోటు ప్రయాణాన్ని నిలిపి వేయాలని ఆదేశించారు. వరద ఉధృతిపై అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. కృష్ణా నదీతీర గ్రామాల ప్రజలు నదిలోకి వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ వెంకటేశ్వర్లును ఆదేశించారు. ప్రఖ్యాతిగాంచిన దత్త పీఠాన్ని చేరుకునేందుకు త్వరలోనే బోటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దత్త పీఠం వద్ద హరిత హోటల్, కన్వెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, అందుకు అవసరమైన 5 ఎకరాల భూమిని ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ వెంకటేశ్వర్లు, తాసీల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో శ్రీధర్, సర్పంచ్ దత్తు, అన్ని శాఖల అధికారులు ఉన్నారు.
మాయమాటలు నమ్మొద్దు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయమాటలు చెప్పేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని, వారితో జాగ్రత్తగా ఉండాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ జీపీ పరిధిలో నర్సాపూర్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వెంకటేశ్, ఆంజనేయులు, రాములు, కృష్ణయ్య సహా 30మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకుడు తిరుపతయ్య ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, ఎంపీటీసీ రవీందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దర్జాగా బతుకుతున్నాం..
మహబూబ్నగర్లోని వివేకానందనగర్ కాలనీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం వార్డు పర్యటన చేశా రు. ఈ సందర్భంగా నూర్ మసీదు నుంచి పోలీస్ లైన్ వెపు వెళ్తుండగా భవన నిర్మాణ పనులు చేస్తు న్న కార్మికులు కనిపించగా వారితో మంత్రి మా ట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారని అడగగా దళితబంధు ద్వారా సెంట్రింగ్ మెటీరియల్ తెచ్చుకొ ని ఉపాధి పొందుతున్నామని కొత్తపేట శేఖర్ స మాధానమిచ్చాడు. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.50వేలు మిగులుతున్నాయని, నేడు దర్జాగా జీవిస్తున్నామని మంత్రికి వివరించాడు. తమకు దళితబంధు పథకాన్ని అందించినందుకు మంత్రి కి వారు కృతజ్ఞతలు తెలిపారు.