మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకే దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. పాలకొండ వాసవీ గార్డెన్స్లో పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో కష్టపడి అభివృద్ధి చేస్తుంటే సహించలేక అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో వాసవీ కన్వెన్షన్ హాల్ కోసం రూ.2 కోట్లు, వైశ్య హాస్టల్ కోసం రూ.25 లక్షలు అందిస్తున్నామన్నారు.
– మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 20
మహబూబ్నగర్ అర్బన్ ఆగస్టు 20 : మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో నెంబర్వన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహబూబ్నగర్ జిల్లా పాలకొండ వాసవీ గార్డెన్స్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో కష్టపడి అభివృద్ధి పనులు చేస్తుంటే కొం దరు ఓర్వలేక తమపై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఏనుగులు పోతుంటే కుక్కులు మొరుగుతాయని, అ లాంటి వారిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నామన్నారు. ఒకప్పుడు కనీసం వైద్యం అందక అత్యవసర పరిస్థితులో హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతోపాటు ప్రభ్వుత దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పించామన్నారు. గాంధీ హాస్పిటల్ తరహలో పాత కలెక్టరెట్ వద్ద వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నామ ని మంత్రి తెలిపారు. భవిష్యత్లో షాద్నగర్ నుంచి దివిటిపల్లి ఐటీ కారిడర్ వరకు మెట్రో రైలును విస్తరిస్తామన్నారు.
జిల్లా కేంద్రంలో శిల్పరామం, ట్యాంక్ బండ్, ఐలాండ్, నెక్లెస్ రోడ్డు, లెజర్షో, మన్యంకొండ రోప్వె, బడ్జెట్ హోటళ్లు పూర్తయితే పట్టణానికి మరింత పర్యాటక శోభ వస్తుందన్నారు. సమైఖ్య రాష్ట్రంలో ఆర్యవైశ్యులు తీవ్ర నిర్లక్ష్యనికి గురైయ్యారని, గత ప్రభుత్వలు వారి సంక్షేమం కోసం ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా నిలిచిందన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవీ కన్వెన్షన్ హాల్ కోసం రూ.2కోట్ల నిధులు, వైశ్య హాస్టల్ కోసం రూ.25లక్షలు అందిస్తున్నామన్నారు.అంతకు ముందు సుమారు వెయ్యి మంది ఆర్యవైశ్యులు ఆత్మీయ సమ్మేళనానికి సతీసమేతంగా హాజరైన మంత్రికి స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుంచి ఫంక్షన్ హాల్ వరకు ప్రత్యేక రథంలో పూలు చల్లుతూ తీసుకెళ్లారు. అనంతరం వారిని పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చెరుకుపల్లి రాజేశ్వర్, శివకుమార్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వాసవీ విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు చక్రధర్గుప్త, ముడా డైరెక్టర్ వేణుగోపాల్, మన్యంకొండ బోర్డు సభ్యులు ఎదిర ప్రమోద్కూమార్, కౌకుంట్ల సువర్ణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రామ్మోహన్, కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక, జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుల, చంద్రమౌళి, కుమారస్వామి, కౌ కుంట్ల రమేశ్, కిష్టయ్య, శ్రీనివాస్ రాము నాగరాజ్ పాల్గొన్నారు.
28న ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం
పాలమూరు, ఆగస్టు 20 : జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో చలో మహబూబ్నగర్ పోస్టర్ను మం త్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. ఈనెల 28న జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హనుమాన్పురలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గణపతి హోమం నిర్వహించగా మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం ఆలయంలో ఇటీవల చోరీకి గురైన విగ్రహాలను పరిశీలించారు. ఆయాకార్యక్రమాల్లో భూత్పూర్ మండల అధ్యక్షుడు సురేందర్గౌడ్,హరినాథ్గౌడ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు హనుమంతు, ప్రధానకార్యదర్శి రాము, కోశాధికారి నారాయణ, వార్డు సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, ఆలయ అర్చకులు పవన్పాండే, తదితరులు ఉన్నారు.