ఉమ్మడి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల హోరు కొనసాగుతున్నది. రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. బీఆర్ఎస్ శ్రేణులు కుటుంబాలతో కలిసి వస్తుండడంతో జోరుగా.. హుషారుగా జరుగుతున్నాయి. శుక్రవారం మహబూబ్నగర్లో కార్మికుల సమ్మేళనానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై దిశానిర్దేశం చేశారు. అలాగే కోస్గిలో జరిగిన తీయని పిలుపునకు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. మీటింగ్ జరిగిన ప్రాంతాలు గులాబీమయంగా మారాయి. ఈసందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, ప్రగతిని ప్రజలకు వివరించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండేలా చూడాలన్నారు.
కోస్గి, ఏప్రిల్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే పీఎం మోదీకి దడ అని బీఆర్ఎస్ జి ల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరె డ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రె డ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జాతీ య రాజకీయాల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని భయపడి మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. కేసీఆర్ పథకాలను కాపీ కొట్టినా.. పూర్తిస్థాయి లో అమలు చేయడంలేదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలోని పథకా లు లేవన్నారు.
నిరంతర ఉచిత విద్యుత్, రై తుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మిష న్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు బిగిం చి స్వచ్ఛమైన తాగునీరందించడంతో మహిళల ఇక్కట్లు తొలగిపోయాయన్నారు. ప్రజల సమస్యలు తెలిసిన కేసీఆర్ వంటి నాయకు డు సీఎంగా ఉండడం మన అదృష్టమన్నా రు. కర్ణాటకలోని కొన్ని గ్రామాల ప్రజలు తె లంగాణలో కలుస్తామని మొరపెట్టుకుంటున్నారన్నారు. మరోమారు బీఆర్ఎస్ను ఆదరించాలని కో రారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడు తూ కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేయడం వల్లే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఆలస్యమైందన్నారు. కొడంగల్ ని యోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరందించే లిఫ్ట్కు బ్రేక్ పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మొద్దని కోరారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల ని ర్లక్ష్యంతో ఈ ప్రాంతం వెనుకబాటుకు గు రైందన్నారు. తాను ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత కోస్గిలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మరో రూ.6 కో ట్లతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ప్ర ణాళికలు రూపొందించామన్నారు. ప్రతిగ్రామానికి బీటీ రోడ్లు వేశామన్నారు. రేవంత్రెడ్డి ఏ ఒక్క నాడు కూడా ప్రజల మధ్య తిరగలేదన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రెస్మీట్లు పెట్టి గప్పాలు కొట్టాడన్నారు. ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ నాయకులకు తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరె డ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, వైస్ చై ర్మన్ వరప్రసాద్, నాయకులు రాజేశ్, ఓంప్రకాశ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.