తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో దివ్యాంగులకు మంచిరోజులు వచ్చాయన్నారు. రూ.3,016 నుంచి రూ.4,016 వరకు పింఛన్ పెంచిన ఘనత ఆయనదే అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 3,933 మంది దివ్యాంగులకు పింఛన్ పెంపు ఉత్తర్వులను కలెక్టర్ రవినాయక్, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులు దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంచి చేసే సర్కారు బాగుండాలని ఆశీర్వదించి బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలబడాలని కోరారు. వివాహం చేసుకున్న దివ్యాంగులకు వెన్నంటి ఉంటామని, వారికి డబుల్ బెడ్రూం ఇల్లు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
– మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 23
మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 23 : దివ్యాంగుల కు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దివ్యాంగులకు రూ. 3,016 నుంచి రూ.4,016లకు ప్రభుత్వం పింఛన్ పెం చింది. మంత్రి జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో ని యోజకవర్గంలోని 3,933 దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.4,016 చొప్పున రూ.1,57,94,928 పింఛన్లకు సంబంధించిన చెక్కును కలెక్టర్ రవినాయక్, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్లప్పుడూ దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు. అం దరి బాగుకోరే ప్రభుత్వానికి మీరందరూ అండగా నిలవాలని కోరారు. దివ్యాంగులను పెళ్లి చేసుకున్న వారికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని, డబుల్ బెడ్రూం ఇల్లు లేదా ఇంటి స్థలం అందిస్తామని తెలిపారు. క్రిస్టియన్పల్లిలోని దివ్యాంగుల కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.10లక్షల నిధులు ఇచ్చామని అంసరమైతే మరో రూ.10లక్షలు కేటాయించి అద్భుతంగా నిర్మిస్తామన్నారు.
భవిష్యత్తులో మహబూబ్నగర్ మ రింత అభివృద్ధి చెందుతుందని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే పింఛన్ పెంచుతామని ప్రతిపక్ష నాయకు లు ప్రచారం చేస్తున్నారని, ఆయా పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ర్టాల్లో ఎందుకు తెలంగాణలో ఇస్తున్న పింఛన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజలు మాయమాటలు నమ్మొద్దని, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్యాదవ్, అడిషనల్ కలెక్టర్ యాదయ్య, గణేశ్, షబ్బీర్, రవికిషన్రెడ్డి, ఎంపీపీలు సుధాశ్రీ, బాలరాజు తదితరులు Chandrayaan-3 విజయవంతం గర్వకారణం..
పాలమూరు, ఆగస్టు 23 : చంద్రయాన్-3 సక్సెస్ దేశం గర్వించదగ్గ రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. భారతీయులుగా మనమందరం గర్వపడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు మంత్రి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నట్లు తెలిపారు.
హన్వాడ, ఆగస్టు 23 : ‘మన ఊరు-మన బడి’ కింద నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనాలను త్వ రగా పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించా రు. మండలంలోని టంకర గ్రామంలో నిర్మిస్తున్న జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంది..? చదువు మంచిగా చెబుతున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నామన్నారు. అనంతరం టీజీవో నాయకుడు సహదేవ్ సోదరుడు యాదగిరిప్రసాద్ దశదిన కర్మకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, సర్పంచ్ వెంకన్న, నాయకులు రమణారెడ్డి, శివకుమార్, జహంగీర్, మన్నాన్ పాల్గొన్నారు.