మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 2 : యువత సమాయాన్ని వృథా చేయకుండా వచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని శిల్పారామంలో 105 కంపెనీలతో 10వేలకుపైగా ఉద్యోగాలను కల్పించేందు కు ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాను క లెక్టర్ రవినాయక్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ జాబ్ మేళాకు యువత భారీ సంఖ్యలో హాజరుకావడం సంతోషాన్నిచ్చిందన్నారు.
గత ఐదేండ్ల లో రాష్ట్రవ్యాప్తంగా 18వేల జాబ్మేళాల ద్వారా 35వేల మందికి ఉద్యోగాలు అం దించామన్నారు. మహబూబ్నగర్లో శ నివారం నిర్వహించిన జాబ్మేళాలో 10 వేల మందికి 105 కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు చేయ గా.. సుమారు 12వేల మంది హాజరయ్యారన్నారు. వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు మహిళలకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎంపికైన ఉద్యోగులకు జాయినింగ్ లెటర్లు అందించారు. కార్యక్రమం లో యువజన సంక్షేమశాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ మోహన్రావు, యాదయ్య, డీవైఎఫ్వో శ్రీనివాసులు, అటవీశాఖ అధికారి సత్యనారాయణ, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.