మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 8: ట్యాంక్బండ్ పనులు పరుగులు పెట్టాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలమూరు ప్రజలు పుష్కరాల కోసం కృష్ణానదికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికం గా ఉన్న పెద్దచెరువును కృష్ణానీటితో నింపి పుష్కర స్నానం కల్పించాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శిల్పారామం, ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్ పనులను ఆయా శాఖల అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఎక్కువ వాహనాలు ఏర్పాటు చేసి పూడికను త్వరగా తీసి, కృష్ణానీటితో నింపేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణా పుష్కరాలకు నదికి వెళ్లకుండా స్థానికంగా పుష్కర స్నానం చేసేందుకు కూడా ట్యాంక్బండ్ సిద్ధం కావాలని సూచించారు. పూడికతీత పనులు వేగంగా పూర్తవ్వాలంటే కేజీఎఫ్ సినిమాను తలపించేలా చెరువు పూడిక పనులు చేపట్టాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు పనుల పూర్తిపై దృష్టి సారించాలన్నారు. వానకాంలోగా పనులు పూర్తి చేయాలన్నారు. వర్షపు నీరు, మురుగు నీటిని నాళాల ద్వారా బయటికి పంపేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూ చించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, పర్యాటకశాఖ ఎండీ మనోహర్, సాగునీటి పారుదలశాఖ డీఈ మనోహర్, వివిధ శాఖల అధికారులున్నారు.
ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 8: వీరన్నపేటలోని హెచ్ఎన్ ఫంక్షన్హాల్లో ఎంఐఎం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. అదేవిధంగా పాతతోట, బోయపల్లిలో నిర్వహించిన విందులోనూ మంత్రి పాల్గొని మాట్లాడారు. అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించారు. కార్యక్రమానికి ఎంఎల్సీ మిర్జారహమాత్బేగ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్మదీ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు చిన్నా, రశీద్ పాల్గొన్నారు.
డిస్ట్రిక్ట్ క్లబ్ న్యూ గెస్ట్హౌస్ ప్రారంభం
మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 8: కుటుంబాల తో వచ్చి ఉత్సాహంగా గడిపేలా డిస్ట్రిక్ట్ క్లబ్ను తీ ర్చిదిద్దాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మ హబూబ్నగర్లోని డిస్ట్రిక్ట్ క్లబ్లో న్యూ గెస్ట్హౌస్ సూట్ రూమ్స్ ప్రారంభోత్సవం, కొత్త భవనం నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో డిస్ట్రిక్ట్ క్లబ్ను ఆఫీసర్స్ క్లబ్ పేరిట అప్పటి కలెక్టర్ గిరిజా శంకర్ స్వాధీనం చే సుకున్నారని.. ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి అని వారితో మాట్లాడి తిరిగి డిస్ట్రిక్ట్ క్లబ్ కమిటీకి స్వాధీనమయ్యేలా చేశామని మంత్రి తెలిపారు. డి స్ట్రిక్ట్ క్లబ్ అంటే కేవలం బార్ అండ్ రెస్టారెంట్ అనే భావన కాకుండా కుటుంబాలతో వచ్చి ఉత్సాహం గా గడిపేలా తీర్చిదిద్దాలని సూచించారు. అత్యంత క్రమశిక్షణ, బాధ్యతతో క్లబ్ నడిపించాలన్నారు.
ఫిలింనగర్ క్లబ్ స్థాయిలో తీర్చిదిద్దాలని సూచించారు. క్లబ్ కార్యకలాపాలను చూసి కొత్తగా స భ్యత్వం తీసుకునే వారి సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. మినీ ఫంక్షన్హాల్ నిర్మించి చిన్నచిన్న శుభకార్యాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెం కన్న, గ్రంథాలయాలసంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ వైస్చైర్మన్ కొరమోని వెంకటయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, డిస్ట్రిక్ట్ క్లబ్ అధ్యక్షుడు అడ్వకేట్ ప్రతాప్కుమార్, కార్యదర్శి మల్లు నర్సింహారెడ్డి, కౌన్సిలర్ గోవిందు, క్లబ్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.