ఉమ్మడి పాలనలో ఎంతో గోసపడ్డామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో, రూరల్ మండలంలో మంత్రి శనివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ప్రగతి పరుగులు పెడుతున్నదన్నారు. ఎందుకు ఓటేయాలనే విషయంపై గ్రామాల్లోకి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. 11 సార్లు అధికారం కట్టబెడితే ఏం చేశారని ప్రశ్నించాలన్నారు. అనంతరం భజరంగ్దళ్ సభ్యులు, ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు సుమారు 500 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పాలమూరు, నవంబర్ 11 : మీ పాలనను మీరే చేసుకునేలా సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని, తొమ్మిదిన్నరేండ్లలో ఊహించని విధంగా అభివృద్ధి సాధించినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూర్, లాల్యానాయక్తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బోయపల్లి రోడ్షోలో మంత్రి మాట్లాడుతూ 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తాగు, సాగునీరు, మౌళిక వసతులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఇలాంటి పార్టీకి ఎందుకు ఓటు వేయాలని మనమంతా ఆలోచించాల్సిన అవసరమున్నదన్నారు. ఇంటింటికీ తాగునీరు, వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తండాలకు మహర్దశ లభించిందని మంత్రి అన్నారు. ఒకప్పుడు లాల్యానాయక్ తండాకు బాట లేక రవాణాకు ఇబ్బందులుండేవని, రోడ్డు సౌకర్యం కల్పించి కష్టాలను తీర్చామన్నారు. త్వరలో సీసీ రోడ్లు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ అనిత, శ్రీనివాస్యాదవ్, గిరిజన నాయకుడు ప్రతాప్నాయక్, సర్పంచులు లాల మ్మ, విజయశాంతి, ఉపసర్పంచ్ రుక్కమ్మ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్కు జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రిని ప్రైవేట్ పాఠశాలల అ సోసియేషన్ ఘనంగా సన్మానించింది. మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మంత్రికి స్వచ్ఛందంగా అండగా నిలుస్తామని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని యూనియన్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు.
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 11 : జిల్లా కేంద్రంలోని 28వ వార్డులోని బండ్లగేరి, కురిహినిశెట్టికాలనీ, 29వ వార్డు పరిధిలోని కుమ్మరివాడి, మదీనామజీద్, 32వ వార్డు పరిధిలోని మక్కామసీదు, టీడీగుట్ట ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 29వ వార్డు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్హదీ, జాకీర్ అడ్వకేట్, బీఆర్ఎస్ నాయకులు మంత్రిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ కో ఆర్డినేటర్ అన్వర్పాషా, కౌన్సిలర్లు పద్మ, సాదతుల్లా హుస్సేనీ, కో ఆప్షన్ మెంబర్ రామలింగం, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు శివరాజు, ఆరెకటిక సంఘం రాష్ట్ర రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్లో పదేండ్లలో ఊహించని అభివృద్ధి చేపట్టారని, అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరినట్లు భజరంగ్దళ్ నాయ కులు పేర్కొన్నారు. మ హబూబ్నగర్ మండలంలో జైనల్లీపూర్కు చెంది న భజరంగ్దళ్ నాయకులు ఏపీ శ్రీను, రా మాంజనేయులు, మాధవిరాజు, అరుణతో పాటు 50మంది బీఆర్ఎస్లో చేరారు. అలా గే మాజీ సర్పంచులు గోపీనాయక్, బుజ్జమ్మతోపాటు 100మంది మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.