హన్వాడ, అక్టోబర్ 28 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగమైపోతామని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆగిపోతాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండలంలోని వేపూర్, రామన్నపల్లి, లింగన్నపల్లి గ్రామాల్లో శనివారం ఇంటింటి ప్రచారం చేశారు. అడుగడుగునా మంత్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బతుకమ్మలు, గంగిరెద్దులతో ఘనంగా స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు పక్కా హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 70 ఏండ్లుగా అన్నదాతలను పట్టించుకోని కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు అధికారమిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. పేదలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఆశీర్వదిస్తే మరింత అభివృ ద్ధి చేస్తానన్నారు. రూ.ఐదు లక్షల ఆరోగ్యశ్రీని రూ.15 లక్షలకు పెంచుతామని, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు పోయి 3 గంటలు మాత్రమే వస్తుందన్నారు. ప్రతిపక్షా ల మాటలు నమ్మి మోసపోవద్దని, వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీలు విజయనిర్మల, రమణారెడ్డి, సర్పంచులు సత్యమ్మ, భారతమ్మ, శ్రీనివాసులు, ఎంపీటీసీ వెంకట్రాములు, సింగిల్విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, నాయకులు లక్ష్మయ్య, జంబులయ్య, రాఘవులు, బసిరెడ్డి, ఆనంద్, యాదయ్య, ఖా జాగౌడ్, శ్రీనివాసులు, చెన్నయ్య, నరేందర్, బాలయ్య, సత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలకు పథకాలను వివరించాలి..
మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 28 : తొమ్మిదేండ్లల్లో బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మోతీనగర్కు చెందిన వివిధ పార్టీల నాయకులు శ్రీకాంత్, సల్మాన్, నాని, రాహుల్, సాయికిరణ్, వినయ్, దీపక్, పర్ష, అంజి, రఘుతోసహా సుమారు 50 మంది యువకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సం ఘం పట్టణ నాయకుడు అజయ్ ఉన్నారు.
ఆదర్శ పాలనను వివరించిన వాల్మీకి..
వాల్మీకి.. రామాయణం రాయడం వల్లే రామరా జ్యం, ఆదర్శ పరిపాలన గురించి తెలిసిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి రోడ్డు కొత్తగంజ్ సమీపంలో ఉన్న వాల్మీకి రామాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలకు హాజరై పూజలుచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామాలయం చాలా చిన్న గుడిసెలో ఉండేదని.. ప్రస్తుతం విశాలమైన స్థలంలో నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రామ్లక్ష్మణ్, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనే అన్ని రంగాల అభివృద్ధి
మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 28 : స్వరాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం మున్సిపాలిటీలోని మూడో వార్డులో ఉన్న అప్పన్నపల్లి, శ్రీరాం కాలనీ, బీసీ కాలనీలో ప్రచారం చేపట్టారు. మంత్రి శ్రీనివాస్గౌడ్పై ప్రజలు పూలవర్షం కురిపిస్తూ, మంగళహరతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అప్పన్నపల్లి వద్ద మొదటి ఫ్లై ఓవర్ను పూర్తి చేయించామన్నారు. కేవలం 12 నెలల్లో రెండో బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించామన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ కూతురు శ్రీహిత, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, ముడా చైర్మన్ వెంకన్న, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్ వనజ, కో ఆప్షన్ సభ్యురాలు జ్యోతి, నాయకులు నగేశ్, శ్రీను, సమద్ ఖాన్, బలరాం, బాలకిషన్ పాల్గొన్నారు.
అభివృద్ధి చేశావ్.. నీకే మా ఓటు
హన్వాడ మండలంలోని రామన్నపల్లిలో ప్రచారానికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్గౌడ్తో గ్రామానికి చెందిన వృద్ధురాలు చంద్రమ్మ ముచ్చటించింది. జనవరి నుంచి ఆసరా పింఛన్ పెంచుతున్నాం కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి కోరగా.. ‘నువ్వు ఇప్పటివరకు మా గ్రామానికి ఎంతో చేశావ్ బిడ్డా.. ప్రతి గ్రామానికి రోడ్డు వేశావ్.. నువ్వు చల్లగా ఉండాలి బిడ్డా నీకు తప్పా మరెవ్వరికీ ఓటు వేయను..కేసీఆర్ సారు వచ్చిన తరువాత మాకు పింఛన్ పెరిగింది. ఎవరి మీద ఆశ పడకుండా ధైర్యంగా బతుకుతున్నాం. మళ్లీ కేసీఆర్ సారే రావాలి..’ అని చంద్రమ్మ మంత్రికి వివరించింది.