హన్వాడ, అక్టోబర్ 4: ఆడపడుచులు దసరా పండు గను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరలు పంపిణీ ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట, టంకర, హన్వాడ, పెద్దదర్పల్లి, మాదారం, గొం డ్యాల, ఇబ్రహీంబాద్, తిరుమలగిరిలో మంత్రి మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు కొత్త పింఛన్కార్డులు పంపిణీ చేశారు. అలాగే హన్వాడ, కిష్టంపల్లిగేటుతండాలో దళితబంధు పథకం ద్వారా మంజూరైన డెయిరీ సెంటర్, కిరాణా దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రెండు నెలల తర్వాత మూడు గ్రామాలను కలిపి ఒకచోట మెగా వైద్యశిబిరం నిర్వహిస్తామని, శిబిరంలో 54రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మండలంలో 1,336పింఛన్లు, 14,973బతుకమ్మ చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రూ.700కోట్లతో భూత్పూర్, చించోలి వరకు రహదారి నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, డిసెంబర్లో పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో మండలం అన్నివిధాలుగా అభివృద్ధి చెంది భూములకు డిమాండ్ పెరుగుతుందన్నారు. సీమాంధ్ర పాలకులు పాలమూరు జిల్లాను ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
సర్కారు దవాఖానలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆయా శాఖల వారీగా పూర్తి సమాచారంతో నివేదికలను తయారు చేయకపోవడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో కల్యాణలక్ష్మి, రైతుబీమా, పింఛన్లు ఎన్ని వచ్చాయని, గ్రామాల వారీగా నివేదిక ఎందుకు తయారు చేయలేదన్నారు. మీ పనితీరు బాగలేదని, మార్చుకోకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, సింగిల్విండో చైర్మన్ వెంకటయ్య, వైస్చైర్మన్ కృష్ణయ్యగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, ఎంపీటీసీలు వడ్లశేఖర్, సత్యమ్మ, కల్పన, వెంకట్రాములు, చెన్నయ్య, సర్పంచులు అచ్చన్న, వెంకన్న, రేవతి, వసంత, సత్యమ్మ, వెంకటయ్య, నాయకులు కొండ లక్ష్మయ్య, జంబులయ్య, కొండ బాలయ్య, బసిరెడ్డి, ఆనంద్, రాఘవులు, హరిచందర్నాయక్, రమణారెడ్డి, సత్యం, యాదయ్య, జహంగీర్, శ్రీనివాసులు, ఆంజనేయులు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.