HomeMahabubnagarMinister Srinivas Goud Criticized That Governor Tamilisai Rejected The Mlcs File Because Of The Conspiracy Of Union Minister Kishan Reddy
కుట్రలకు తెరలేపిన కిషన్రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ను గవర్నర్ తమిళిసై తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. మ హబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయం లో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఆయన వల్లే ఎమ్మెల్సీ ఫైల్ తిరస్కరణ
రాజకీయ నాయకురాలు గవర్నర్ కాలేదా..?
బీజేపీకి ఒకలా.. బీఆర్ఎస్కు మరోలా న్యాయమా..?
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
84 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 25 : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ను గవర్నర్ తమిళిసై తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. మ హబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయం లో మంత్రి మీడియాతో మాట్లాడారు. రా ష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన ఎమ్మెల్సీ అ భ్యర్థులు కుర్రా సత్యానారాయణ, దాసోజు శ్రవణ్ రాజకీయ నాయకులని పేర్కొంటు గవర్నర్ తిరస్కరించడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నించారు. తమిళనాడు బీ జేపీ అధ్యక్షురాలైన తమిళిసై గవర్నర్ కాలే దా అని అన్నారు. బీజేపీకో న్యాయం బీఆర్ఎస్ పార్టీకి మరో న్యాయమా అని నిలదీశారు. ఇది బలహీన వర్గాలకు చెందిన వా రిని అణిచివేసే కుట్ర అని అన్నారు. పీఎం మోదీ బీసీ అయినా బీసీలకు తీరని అన్యా యం జరుగుతుందన్నారు. బీజేపీలో ఉం డి రాజకీయం చేస్తే పవిత్రం.. ఇతర పార్టీల వారు చేస్తే అపవిత్రం అయిపోతుందా? అ ని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి క క్షపూరితంగానే ఎరుకల సామాజిక వర్గాని కి చెందిన సత్యానారాయణ, ఎంబీసీ అ యిన శ్రవణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్కు చెప్పి నిలుపుదల చేయించారని వి మర్శించారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం బీసీల రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశ పెట్టాలని, త్వరలో తెలంగా ణ వస్తున్న ప్రధాని మోదీకి చెప్పి బీసీ బిల్లు ను ఆమోదించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్లోకి చేరిక
జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం లో హన్వాడ మండలం వేపూర్కు చెందిన గోపాల్యాదవ్, కేశవులుయాదవ్, మల్ల య్య, శ్రీనివాస్, పద్మమ్మ సహ కాంగ్రెస్, బీజెపీ పార్టీలకు చెందిన 50మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. కార్యక్రమంలో రైతుబం ధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాద వ్, గొర్రెల కాపరుల సహకార సంఘం జి ల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్ తదితరు లు పాల్గొన్నారు.
పేదలకు అండగా సర్కారు
హన్వాడ, సెప్టెంబర్ 25 : గతంలో ఆడబిడ్డల పెండ్లి చేయాలంటే వారి తల్లిదండ్రు లు అప్పు చేయాల్సి వచ్చేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ సర్కారు వచ్చినంక కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారని స్ప ష్టం చేశారు. సోమవారం హన్వాడ రైతు వే దికలో 84మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పుటివరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా 1,871మందికి రూ.16,68కోట్లు, 36 కుటుంబాలకు రైతుబీమా కింద రూ. 15,30కోట్లు అందించామన్నారు. మరోసారి బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రూ.4వేల పింఛన్, రైతుబీమా, పంట పెట్టుబడి, 24గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పీఆర్ఎల్ఐతో ప్రతి చెరువునూ నింపుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, సింగిల్విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, రైతుబంధు మండల కన్వీనర్ రాజుయాదవ్, సర్పంచ్ రేవతి, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసీల్దార్ కిష్టానాయక్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.