మహబూబ్నగర్ : యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 56వ ర్యాంక్ సాధించిన కె. కిరణ్మయిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. శుక్రవారం కిరణ్మయి కుటుంబ సభ్యులతో హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కిరణ్మయికి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు రావడం పట్ల మంత్రి అభినందనలు తెలియచేశారు.
పట్టుదలతో చదివితే ర్యాంకులు సాధించడం పెద్ద విషయం కాదని కిరణ్మయి నిరూపించిందని మంత్రి పేర్కొన్నారు. ఆమెకు, కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. ఐఏఎస్ అధికారిగా పేద ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.