మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 26 : ఎన్నికల సమయంలో వస్తారు.. 34 రోజులు తిరుగుతారు.. ఆ తరువాత ఫోన్ బంద్ చేసుకుంటారని, అలాంటి మోసం చేసే నాయకులతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 9వ వార్డు పాలకొండ, 4వ వార్డు ఎదిర, బీసీ కాలనీలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాలకొండలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఎదిర ఎలా ఉండేది.. నేడు ఏ విధంగా ఉందో మీకు తెలుసని మంత్రి గుర్తుచేశారు. ఎదిరకు మూడు దిక్కులా రోడ్లు ఉన్నాయి. గత పాలకులు మీ గురించి ఆలోచించలేదు. మాయమాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు. కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయకపోవడంతో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. 15 ఏండ్ల్లకు 20 ఏండ్లకు వచ్చే నాయకుల మాటాలు నమ్మవద్దు..
కేవలం కుల, మత రాజకీయాలు చేస్తారన్నారు. ఎదిర పక్కకు ఐటీ పార్కు.. పెద్ద కంపెనీలు వస్తున్నాయని దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పాలకొండ అంటే ఎక్కడో మూలన ఉండేది.. నేడు బైపాస్తో ఇక్కడి రూపురేఖలు మార్చాం. ఎదిర, అప్పన్నపల్లి, ఎనుగొండ ఎంతో అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ఇంక అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఎదిర బీసీ కాలనీలో తిరిగి ప్రజలను పలుకరించారు. అక్కడ చేనేత కార్మికులతో కలిసి మగ్గం నేశా రు. ఎదిర బీసీ కాలనీకి చెందిన అజీజుల్లాను అప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా అజీజుల్లా సారు.. మీరు లక్ష మోజార్టీతో గెలువాలని ఆ కాక్షించారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని 3వ, 5వ వార్డు హౌసింగ్బోర్డు, 8వ వార్డు, 10వ వార్డు, 20వ వార్డులో సాయంత్రం ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీ బీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, కౌన్సిలర్లు నరేందర్, యా దమ్మ, కోరమోని వనజా, నీరజావిఠల్రెడ్డి, రాణి, అనంతరెడ్డి, పాల్గొన్నారు.
మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 26 : బీఆర్ఎస్ సర్కారు తమకు అన్నీ ఇచ్చిందని ప్రభుత్వ పథకాల లబ్ధిదారురాలు తిరుపతమ్మ తెలిపారు. మహబూబ్నగర్ ము న్సిపాలిటీలోని పాలకొండలో ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం ఇంటింటి ప్రచారం చేపట్టా రు. ఈ క్రమంలో పాలకొండకు చెందిన తిరుపతమ్మ ఇం టికి వెళ్లగా ఆమె కట్టెల పొయ్యిపై జొన్నరొట్టెలు చేస్తూ కనిపించింది. ‘అయ్యో తిరుపతమ్మ.. గ్యాస్ ధర ఎక్కువైంద ని కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నావా.. వచ్చే ఎన్నిక ల్లో తమను గెలిపిస్తే మోదీ పెంచిన గ్యాస్ భారాన్ని భరి స్తాం.. జనవరి నుంచి రూ.400కే సిలిండర్ అందజేస్తాం.. ఇక త్వరలో మీకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి లభిస్తుంది’ అని మంత్రి తెలిపారు. పెనంపై రొట్టెలను కాల్చి మహిళకు సాయం చేశారు. తిరుపతమ్మ మంత్రికి వేడివేడి రొట్టెలు ఇవ్వగా.. తింటూ ఆమెతో కాసేపు ముచ్చటించారు. తెలంగాణ ప్రభుత్వం అందించే పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నామని తిరుపతమ్మ చెప్పారు. కచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తామని, సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్కు అండగా ఉంటామని తెలిపారు.