మహబూబ్నగర్, నవంబర్ 21 : ఎన్నో యేండ్లుగా అభివృద్ధికీ దూరంగా ఉన్న మన మహబూబ్నగర్ అభివృద్ధిని విశ్వవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు వచ్చేలా సమిష్టిగా కృషి చేస్తు ముందుకు అడుగులు వేద్దామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకు లు ఇబ్రహీంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎవరో వచ్చి ఎదో చేబితే తమ ఓటు హక్కును ఎలా పడితే అలా వేయకూడదని, గడిచిన పదేండ్ల సమయంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని మదిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నా రు. మన్యంకోండ రోప్వేతోపాటు మహబూబ్నగర్ చుట్టు రింగ్రోడ్డు, మినీట్యాంక్బండ్ అభివృద్ధి, జంగల్ సఫారీ పార్కు, కేసీఆర్ ఏకో అర్భన్ పార్కుతోపాటు అనేక అంశాలలో మహబూబ్నగర్ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చేందుకుగా నూ ఎంతో కృషి చేస్తున్నామని వివరించారు. నిర్లక్ష్యం అనే మా టకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని బీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసుకునేందుకు చాలా మంది దూరంగా ఉండేవారని, నేడు వేలాది మందికి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
మహబూబ్నగర్ అభివృద్ధి కోసం అందరి మేధావులతో చర్చిం చి మరింత అభివృద్ధి సాగేందుకు సీఎం కేసీఆర్ను ఏమి అడుగాలో వాటి అన్నింటిని సాధించుకునేందుకు సీఎంకే సాధాభివందనం చేసైనా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేద్దామన్నారు. సీఎంరిలిఫ్ పండ్ ద్వారా మన నియోజకవర్గంలో రూ.24 కోట్లు నిధులను ప్రత్యేకంగా వారంలో మూడు మార్లు సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి సంతకం చేసుకుని అందించడం జరిగిందని తెలిపారు. గతంలో మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న సీఎం కేసీఆర్, పాలమూరు పచ్చబడిన తరువాత హెలిక్యాప్టర్ ద్వారా మన దగ్గరకి వస్తున్నారని, పై నుంచి చూస్తే చేసిన అభివృద్ధి చూసి సీఎం కేసీఆర్ ఎంతో సంతోషపడుతారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుంచి మ ధ్యాహ్నం 2:45 గంటలకు హెలిక్యాప్టర్ నుంచి దిగి సమీపం లో ఉన్న బాలుర కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేయనున్నారని తెలిపారు. పలువురు ప్రముఖులను సీఎం కేసీఆర్తో పరిచయం చేసుకుంటు మహబూబ్నగర్ అభివృద్ధికి ఏమి కావాలో అడిగి మునుముందు సీఎం కేసీఆర్ నుంచి హామీ తీసుకుందామని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలు బారీ స్థాయిలో మహబూబ్నగర్కు చేరుకొని ఘనంగా స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు.
ఒక తెల్లని పేపర్ తీసుకుని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్తోపాటు ఇత ర పార్టీలు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి ? అవి చేసిన అభివృద్ధి ? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి గడిచిన పది సంవత్సర అభివృద్ధిని పూర్తిస్థాయిలో చేసిన ప్రతి అభివృద్ధి అం శాలను రాసుకుని చూడాలని అప్పుడు బీఆర్ఎస్ ఎంత శ్రమిస్తే గింత అభివృద్ధి జరిగింది? అని ప్రతి గుండెకు తెలుస్తుందన్నా రు. మన మహబూబ్నగర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలలో ఉన్న వివిధ కంపెనీలను తీసుకువచ్చి మహబూబ్నగర్ను అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామన్నారు.
ప్రజలకు మంచి చేయడం వారి ఆరాటం కాదని, కేవలం వారి అభివృద్ధి కోసమే అడుగులు వేస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న నేతలు ఆ యా పార్టీల్లో లేరని, కేవలం వారి ప్రయోజనాల కోసమే ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లోకి వచ్చి మతకల్లోలు సృష్టించేందుకు తహ తహ లాడుతున్నారని తెలిపారు. మయ మాటలను ఎవరు నమ్మకూడదని, చేసిన అభివృద్ధి చూసి మన ప్రాంతం ఎలా అభివృద్ధి సాగిస్తుందని అలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ప్రతి బిడ్డకు ఉపాధి, ఉద్యోగం కల్పించేలా కంపెనీలను తీసుకువచ్చి ప్రత్యేకంగా వారి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. విదేశాలల నుంచి ఎంతో మంది ముందుగానే వచ్చి మేము మీతో ఉంటాం.. మీ గెలుపునకు మా మద్దతు పూర్తిస్థాయిలో అందించి అప్పుడు వెళ్తామని చెబుతున్నారని, అందరి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతామని తెలియజేశారు.
పాలమూరు, నవంబర్ 21 : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వచ్చేవి కష్టాలేనని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, పథకాలను చూసి ప్రజలు కారుగుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ మండలంలోని అల్లీపూర్, ధర్మాపూర్, చౌదర్పల్లి గ్రామాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వా తంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాం తాన్ని తీవ్రంగా నిర్లక్షం చేసిందని అగ్రహ వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎంత అద్భుతంగా మార్చమో ఒకసారి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత 24గంటల ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వలేదని ప్రచారానికి వచ్చిన వారిని నిలదీయాలని పేర్కొన్నారు. అనారోగ్యం బారిన పడిన సందర్భంలో వేలాది మందిని చికిత్స అందించి ప్రాణాలు కాపాడామన్నారు. ప్రజలకు సేవ చేయడమే కాకుం డా అండంగా నిలబడిన తనకు ఈ ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం అందించాలని కోరారు. అదేవిధంగా బీజేపికి చెందిన మాజీ ఎంపీ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన కుమారుడు ఈ ప్రాంతానికి చేసింది ఏమి లేదన్నారు. బీజేపీ తరఫున రెండున్నరేళ్ల ఎమ్మెల్యేగా పనిచేసి ఒక్క పని చేయని వ్యక్తి ఇప్పుడు రాత్రికి రాత్రి పార్టీ మారి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ పదేండ్లల్లో తాను చేసిన అభివృద్ధిని గొప్పగా చెప్పుకుంటానని అందుకే ఓ పుస్తక రూపంలో ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కారుగుర్తుకు ఓటేసి
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మూడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, గొర్రెల కాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, నేతలు అన్వర్పాషా ఉన్నారు.