పెద్దమందడి, నవంబర్ 15 : ప్రజలు మాయమాటలు చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని, బతుకుదెరువు క ల్పించిన కేసీఆర్కు అండగా నిలిచి రా ష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. మండలంలోని జంగమాయిపల్లి, బలిజపల్లి, పామిరెడ్డిపల్లి, ముందరితండా, చీకర్చెట్టుతం డా, వీరాయపల్లి, గట్లఖానాపూర్, స్కూల్తండా, వెల్టూరు, చిలకటోనిపల్లి గ్రామాల్లో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలుమెచ్చారు కాబట్టి తమకు రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టారని మంత్రి పేర్కొన్నారు. బతుకుదెరువు కల్పించిన ప్రభుత్వానికి ప్రజలు మరోసారి అండగా నిలవాలన్నారు. తె లంగాణలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని సాగునీరు, విద్య, వైద్యం తదితర వాటిని పెద్దమొత్తంలో కల్పించుకున్నామని తెలిపారు. ఇప్పుడు సాగునీటి బాధ్యత పూ ర్తికావడంతో రాష్ట్ర ఆదాయం మెరుగ్గా ఉందని, రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో పనులు చేసుకునే వారికి చేసుకున్నంత పనులు దక్కుతున్నాయని తెలిపారు. గతంలో తెలంగాణలో పనులు లేక పట్నం, బొంబాయి, దుబా య్ తదితర ప్రాంతాలకు వలసలు వెళ్ల్లేవారని కానీ నేడు తెలంగాణలో రాష్ర్టానికి వలసలు పెరిగి జీవనం సాగిస్తున్నారన్నారు. దేశంలో అత్యధికంగా వరి పంట పండే రాష్ట్రంగా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో వానకాలంలో 66లక్షల ఎకరాల్లో వరి సాగైందని, అదే ఆంధ్రా రాష్ట్రంలో కేవ లం 38లక్షల ఎకరాల్లో వరిపంట సాగైందన్నారు. నియోజకవర్గంలో ఏఒక్క ఎకరా భూమి బీడు ఉండకూడదని, ఏ ఒక్క మనిషి ఖాళీగా ఉండకూడదనే తపనతో నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు తీసుకొచ్చానని తెలిపా రు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకం అందని గడప లేద ని, ఏదో ఒక రూ పంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకం అం దుతుందన్నారు. వ్యవసాయాన్ని నిలబెట్టిన ఘనుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. బాగుపడ్డ తెలంగాణను సోల్లు చెప్పే వారి మాటలు విని మళ్లీ రాబందుల చేతి లో పెట్టాలా అని ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు. ఆంధ్రా పల్లెలకంటే తెలంగాణ పల్లెలు బాగున్నాయని ప్రజలంటున్నారన్నారన్నారు.
తెలంగాణలో పండించిన ప్రతి గింజనూ కేసీఆర్ ప్రభుత్వం క ల్లాల వద్దనే కొనుగోలు చేస్తుందన్నారు. ఏ గ్రామానికి ఆగ్రామాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి అకౌంట్లతో డబ్బులను ప్రభు త్వం జమ చేస్తుందన్నారు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే వారు ఏమి ఒరగబెట్టారని, చెప్పుకోదగ్గ పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలోకి రమ్మం టే రా కుండా మొఖం చాటేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం కోసం ఆరాటపడుతుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో క రెంట్ ఎన్ని గంటలు ఇస్తున్నారో, పింఛన్లు ఎంత ఇస్తున్నారో చెప్పాలన్నారు. రా నున్న రోజుల్లో పేద కోసం సీఎం కేసీఆర్ రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తారని, అదేవిధంగా ఆసరా పింఛన్లు రూ.5 వేలు, రైతుబంధు సాయం రూ.16వేలు ఇస్తారన్నారు. వ్యవసాయ కూలీలతో మంత్రి ముచ్చట్లు పామిరెడ్డిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మంత్రి నిరంజన్రెడ్డి ముచ్చటించారు. వ్యవసా యం ఎలా ఉందని మంత్రి రైతులను అడుగగా ఇదం తా మీరు సాగునీరు తీసుకురావడం వల్లనే ఇన్ని ధాన్య పు రాశులు వచ్చాయని మేము ఏ పార్టీ వారు వచ్చినా వారిని పట్టించుకోమని, అన్నంపెట్టి రైతన్నలంతా నిరంజన్రెడ్డినే గెలిపించుకుంటామని రైతులు చెప్పారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రికి డప్పు వాయిద్యాలు, మంగళహారతు లు, గజమాలలతో ఘనంగా ప్రజలు స్వాగతం పలికారు. మంత్రి సమక్షంలో భారీగా చేరికలు పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంత్రి నిరంజన్రెడ్డి స మక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రా మానికి చెందిన కాంగ్రెస్ , బీఎస్పీ నాయకులు ఆంజనేయులు ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచులు భాగ్యమ్మ, సతీశ్, జయం తి, వెం కటేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు, మాజీ ఎం పీపీ మన్యపురెడ్డి, నాయకులు శశివర్ధన్రెడ్డి, జానకిరాములు, శ్రీనివా స్గౌడ్, గోవర్ధన్రెడ్డి, గోపాల్నాయక్, రమేశ్నాయక్, మాజీ సింగిల్విండో అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఉన్నారు.
వనపర్తి రూరల్, నవంబర్ 15 : పని చేసే నాయకుడి, బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటేనే ప్రజలంతా ఉంటారని, అనునిత్యం పార్టీలో చేరుతున్న చేరికలు అందుకు నిదర్శనం అన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాజపేట గ్రామం లో మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజనగరం రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో 34మంది, తండా నుంచి 30మం ది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. కార్యక్రమంలో సుదర్శన్రెడ్డి, లోకారెడ్డి, ఎల్లయ్య, పెంటయ్య, అశోక్, సంపత్రెడ్డి, సుధాకర్రెడ్డి, సతీశ్, శ్రీనివాస్రెడ్డి, సేవ్యానాయక్, ఠాకూర్ నాయక్, కురుమూర్తి యాదవ్, రవిప్రకాశ్రెడ్డి, రాములయ్య పాల్గొన్నారు.