వనపర్తి, జూన్ 2 : వనపర్తి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తె లంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన రా ష్ట్రంలో దశాబ్ది వేడుకలను జరుపుకొంటున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, ఎస్పీ రక్షితామూర్తి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రై తులను అగ్రభాగాన నిలపాలనే చిత్తశుద్ధితో దేశంలో ఎక్కడా లేని వి ధంగా రైతుబంధు అమలు చేస్తున్నామన్నారు. ఏడాదికి రెండు సీజన్లు కలిపి రూ.10 వేలను పెట్టుబడి సాయం కింద జిల్లాలో 1,64,479 మంది రైతుల ఖాతాల్లో రూ.1,602 కోట్లను జమ చేశామన్నారు. ఇ ప్పటివరకు 2,473 మంది అన్నదాతల కుటుంబాలకు రూ.137.15 కోట్ల రైతుబీమాను చెల్లించి అండగా నిలిచామన్నారు.
ఈ సారి బడ్జెట్లో రుణమాఫీకి సంబంధించి నిధులు కేటాయించామన్నారు. వానకాలం రైతుబంధు తర్వాత రుణమాఫీ అమలు చేస్తామని వివరించారు. రైతులకు అవసరమైన శిక్షణ, సమాచారాన్ని అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 71 రైతువేదికలను నిర్మించామన్నారు. కాల్వలు, ప్రా జెక్టుల ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా 6.5 టీఎంసీల సామర్థ్యంతో గోపాల్పేట మండలంలో ఏదుల రిజర్వాయర్ను నిర్మించామన్నారు. పనులు వంద శా తం పూర్తయ్యాయన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లా సరాసరి భూ గర్భ జలమట్టం 7.6 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 5.11 మీటర్లు ఉన్నదన్నారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో టీయూఎఫ్ఐడీసీ, పట్టణ ప్రగతి నిధుల నుంచి మురుగు కాల్వలు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, జంతువుల సంరక్షణ కేంద్రం, పార్కులు, సెంట్రల్ లైటింగ్, మీడియన్ ప్లాంటేషన్, అమ్మచెరువు, తాళ్ల చెరువు సుందరీకరణ పను లు చేపట్టేందుకు రూ.52.48 కోట్లు మంజూరయ్యాయన్నారు.
ఇప్పటివరకు రూ.10.72 కోట్లు ఖర్చు చేసి కొన్ని పనులు పూర్తి చేశామని, మిగతా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భా గంగా ఈ ఏడాది ప్రకటించిన ర్యాంకుల్లో సౌత్జోన్లో వనపర్తి ము న్సిపాలిటీ 51వ ర్యాంకు.. రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకును సొంతం చేసుకున్నదన్నారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులతో 2019-20 నుంచి 2021-22 వరకు 181 పనుల ను రూ.4.58 కోట్ల అంచనాతో చేపట్టి.. రూ. 1.19 కోట్లతో 69 పనులను పూర్తి చేశామన్నారు. 2020-21 సంవత్సరానికిగానూ రూ.3.93 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను ఆయా మండలాలకు కేటాయించామన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రతిఒక్కరూ శక్తి వంచనా లేకుండా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, రాష్ట్ర కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ సభ్యుడు తిరుమల మహేశ్, కౌన్సిలర్లు సిబ్బంది పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగం మరువలేనిది.
రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగం మరువలేనిదని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి నిరంజన్రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మ డి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, స్వరాష్ట్ర పాలనలో అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదు
కుంటున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్లు సత్యం, కృష్ణ, నారాయణ, నాయకులు పాల్గొన్నారు.