ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వరి పంట చేతికొచ్చింది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించినా.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి విక్రయాలు చేపడుతున్నది. ఎక్కడికక్కడ గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నది. సెంటర్ల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా టెంట్లు, తాగునీరు, టార్పాలిన్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నది. వనపర్తి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సోమవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెంటర్ల ద్వారా దండిగా ధాన్యాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకే కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతుల డిమాండ్ మేరకు అవసరమైతే మరిన్ని కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.
వనపర్తి రూరల్, ఏప్రిల్ 24 : డిమాండ్ బట్టి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తున్నామని.. అన్నదాతకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అంజనగిరిలో నాగవరం వ్యవసాయ సహకార సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 260 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తన పని చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే భారం మో స్తూ రైతులకు మద్దతుధర అందిస్తున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. అనంతరం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు కురుమయ్య తల్లి శంకరమ్మ మృతి విషయం తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో నాగవరం, రాజనగరం పీఏసీసీఎస్ చైర్మన్లు మధుసూదన్రెడ్డి, చైర్మన్ రఘువర్ధన్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, రైతుబంధు స మితి మండల అధ్యక్షుడు నర్సింహ, మార్కెట్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ విజయ్కుమార్, బీఆర్ఎస్ జిల్లా శిక్షణా తరగతుల కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, గొర్రెలకాపరుల సంఘం కన్వీనర్ కురుమూర్తియాదవ్, సర్పంచ్ నారాయణ, ఉపసర్పంచ్ దర్మేందర్, డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ అధికారులు, సివిల్ అధికారి, డీఎస్వో పాల్గొన్నారు.
గోపాల్పేట మండలం పొల్కెపహాడ్కు చెందిన 25మంది ఆటో యూనియన్ నాయకులు జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జెడ్పీటీసీ మంద కోటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో సోమవా రం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, కోఆప్షన్ సభ్యులు మతీన్, శ్రీనివాసరావు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శ్రావణ్కుమార్, నాయకులు పాల్గొన్నారు.