వనపర్తి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): వనపర్తి వాసులు వివేకవంతులు, విజ్ఞానవంతులని మరోసారి ప్రజా దీవెనలతోనే ముందుకు సాగుతానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి నిరంజన్రెడ్డి , మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం రాజీవ్ చౌరస్తాలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. వనపర్తిని సాగునీరు, విద్య, వైద్యంతోపాటు అనేకరంగాల్లో అభివృద్ధి చేశానని, తను చేసిదంతా మీ కండ్ల ఎదుట కదలాడుతుందని, ఆ విశ్వాసంతోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోనే వనపర్తికి గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేశానని మంత్రి పేర్కొన్నారు. ఈతరం ప్రజలు, విద్యార్థుల అభ్యున్నతి కోసం అనేక పనులు చేపట్టామని, ఇంజినీరింగ్, మెడికల్, వ్యవసాయ, నర్సింగ్ కళాశాలతో పాటు వాళ్ల భవిష్యత్ కోసమే అనేక విద్యాసంస్థలు వనపర్తికి తీసుకొచ్చామన్నారు. తాను చేసిన అభివృద్ధిని చూసి ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. 2014ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు, 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోనే భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినప్పుడు కూడా తాను సహనంతో పని చేశానే తప్పా ఉలిక్కి పడలేదన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెచ్చుకున్న నియోజకవర్గంగా వనపర్తికి పేరుందని, 40వేల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయని గుర్తుచేశారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని మంత్రి సింగిరెడ్డి చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డిలాంటి మ హనీయులను ఎన్నుకున్న తర్వాత ఉన్నత విద్యావంతులను వనపర్తి ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటున్నారని, రాష్ట్రంలోనే వనపర్తి అగ్రశ్రేణి ని యోజకవర్గాల్లో ఒకటిగా నిలబెట్టానని మంత్రి చెప్పారు.
రాష్ట్రం, దేశంలో కానీ వెయ్యి జాకీలు పెట్టినా కాంగ్రెస్ లేవలేని పరిస్థితిలో ఉందని మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన చిన్నారెడ్డి ఆపార్టీకి పనికి రాలేదని, 40రోజుల కిందట పార్టీలో చేరి పైరవీ చేసుకున్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేసిందన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాల్లో ఐదుగురు అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారేనన్నారు. బీఆర్ఎస్ బీఫారంతో గెలుపొంది పదవికి రాజీనామా చేయనోళ్లు అడ్డం..నిలువుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నిక కావచ్చని, ప్రజలు ఓటు వేసేటప్పుడు వారి అర్హతలను గమనించి ఓటు వేయాలన్నారు. బట్టకాల్చి మీద వేసే వాళ్లు చాలా మంది ఉన్నారని, తనకంటే ఎక్కువ పనిచేసే వాళ్లు ఎవరైనా ఉంటే పరిశీలించాలని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి నిరంజన్రెడ్డి నామినేషన్ సందర్భంగా వనపర్తి పట్టణం మరోసారి గులాబీమయమైంది. పట్టణంలోని రోడ్లన్నీ గులాబీ జెండాలతో నిండాయి. ప్రధాన కూడళ్లు, రహదారులు గు లాబీ ఫ్లెక్సీలు, జెండాలతో రెపరెపలాడాయి. వివిధ మండలాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు తరలివ చ్చారు. సింగిరెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా మర్రికుంట వరకు కార్యకర్తలు ప్రదర్శనలు చేస్తూ వెళ్లారు. ఎటుచూసినా బీఆర్ఎస్ కార్యకర్తలో రోడ్లన్నీ నిండిపోయాయి. జెండాలు చేతపట్టుకుని కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలను మా ర్మోగించారు. గంగిరెద్దులతో విన్యాసాలు, డప్పుల, పటాకుల మోతలు, భాజా భజంత్రీలతో పట్టణ వీధులు పులకించాయి.
మంత్రి నిరంజన్రెడ్డి అట్టహాసంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖ లు చేశారు. ముందుగా ఖిల్లాఘణపురం మండలం గట్టుకాడిపల్లి వేంకటేశ్వర ఆలయంలో కుటుంబసమేతంగా ప్రత్యేక పూ జలు చేసి వనపర్తికి చేరుకున్నారు. ఇంటి నుంచి భారీ ర్యాలీగా కార్యకర్తలు వెంటరాగా, ఎద్దుల బండిపై మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి కలెక్టరేట్ వరకు అట్టహాసంగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరుపతిరావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలులో మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ని యోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూ రు ప్రమోద్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, శిక్షణా తరగతుల చైర్మన్ పురుషోత్తం రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ కురుమూర్తి యాదవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, న్యాయవాది చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, ఎంపీపీ కృష్ణానాయక్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పలువురు నాయకులు ఉన్నారు.