నారాయణపేట టౌన్, జనవరి 30 : ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పట్టాలు ఇ చ్చేందుకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీసీ నుంచి సోమవారం పోడు భూములు, కంటివెలుగు, ఉపాధ్యాయల బదిలీలు, పామ్ ఆయిల్ తోటల సాగుపై సమీక్షించారు.
వీసీలో పాల్గొన్న కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ పోడు భూములకు సంబంధించి ఎఫ్ఆర్సీ, గ్రామ సభలు నిర్వహించుకొని జిల్లా కమిటీ పరిశీలనలో ఉన్నాయని, ఫిబ్రవ రి 7లోపు అర్హులైన వారికి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కంటివెలుగులో భాగంగా జిల్లా లో 24 బృందాలతో 20,583 మందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. ఉపాధ్యాయల పదోన్నతులు, బదిలీల వి షయంలో సీనియార్టీ జాబితా సిద్ధం చేసుకొని ప్రదర్శించామన్నారు. ప్రత్యేక మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. పామ్ ఆయిల్ విషయంలో రైతులకు ప్రోత్సాహం అందించా మని, ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, డీఈవో లి యాఖత్ అలీ, ఉద్యానవన శాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో ప్రజలు అందించే ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించి అనంతరం మాట్లాడారు. భూ సమస్యలు, పింఛన్ తదితర సమస్యలతో ప్రజలు అధికారుల వద్దకు వ స్తుంటారని, వాటిని పరిశీలించి పరిష్కరించాలన్నారు. కా ర్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.