భీమ్గల్/మోర్తాడ్, జూలై 19 : అభాగ్యులు, ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని అనేక మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికసాయాన్ని మంజూరు చేయించి ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. తాజాగా వివిధ కారణాలతో దవాఖానలో చికిత్స చేయించుకుంటున్న ముగ్గురికి మంత్రి బాసటగా నిలిచారు. మెరుగైన చికిత్స కోసం మొత్తం రూ.5లక్షల 50వేల విలువైన ఎల్వోసీలను బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో అందజేసి ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్న తమను దేవుడిలా ఆదుకున్న మంత్రికి బాధిత కుటుంబసభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ప్రశాంత్రెడ్డితోపాటు కేసీఆర్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
భీమ్గల్ పట్టణానికి చెందిన ఎస్.శంకర్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. బ్రెయిన్కు సంబంధించిన చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు చెప్పడంతో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో బాధితులు మంత్రి ప్రశాంత్రెడ్డిని ఆశ్రయించారు. ఆయన వెంటనే స్పందించి శంకర్ చికిత్స కోసం రూ. 2లక్షల 50వేల ఎల్వోసీ మంజూరు చేయించారు. ఆర్థికసాయం కాపీని బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. భీమ్గల్ మండలం పురాణీపేటకు చెందిన బి.రామకృష్ణ, మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన వై.గంగాధర్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి వేముల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. వెంటనే ఒక్కక్కరికి రూ.లక్షా 50వేల చొప్పున ఎల్వోసీని మంజూరు చేయించి అందించారు.