మద్దూర్ (కొత్తపల్లి), నవంబర్ 21 : కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవని భూగర్భ వనరులు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని నందిపహాడ్, లక్కాయపల్లి, పల్లెర్ల గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలప్పుడే వచ్చి మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతల కల్లబొల్లి మాటలను నమ్మొద్దని కోరారు.
రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. నిత్యం ఇంటి ముందు తిరిగే నరేందర్రెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటేనే సమస్యలుండవన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు చెల్లుబాటయ్యే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ సలీం, మాజీ జెడ్పీటీసీ బాల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.