పెబ్బేరు, అక్టోబర్ 5 : సీఎంగా కేసీఆర్ను మూడోసారి ఆశీర్వదించి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. గురువారం పెబ్బేరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి కోట్లాది రూపాయల వ్యయంతో 12 గ్రామాల్లో ఏర్పాటు చేసిన 28 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పెబ్బేరు పట్టణంలో 162, గుమ్మడంలో 100 మందికి డబుల్బెడ్రూం ఇండ్లు, జర్నలిస్టులకు నివేశన స్థలాల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న తమకు రాబోవు రోజుల్లో మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు.
పెబ్బేరులో డబుల్ బెడ్రూం ఇండ్లకు ఎంపికైన మిగితా లబ్ధిదారులకు, రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన వారికి దశల వారీగా గృహలక్ష్మి పథకాన్ని అమ లు చేస్తామని ప్రకటించారు. అలాగే డబుల్బెడ్రూం కాలనీని గేటెడ్ కమ్యూనిటీ కాలనీగా రూపుదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా సాగు నీరు, మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు, ప్రతి రైతు కుటుంబానికి రక్షణనిచ్చే రైతు బీమా, రైతు బంధు పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
బీసీ బంధు, దళిత బంధుతో చేతి వృత్తులు, స్వయం ఉపాధికి ఊతమిచ్చామని చెప్పారు. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పే వారిని నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించా రు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్చైర్మన్ కర్రెస్వామి, సింగిల్ విండో అధ్యక్షుడు రామిరెడ్డి, వైస్ ఎం పీపీ బాలచంద్రారెడ్డి, తాసీల్దారు లక్ష్మి, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు, నాయకులు వనంరాములు, బుచ్చారెడ్డి, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.