వనపర్తి, మార్చి 11: రైతులు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, విద్యుత్శాఖ తరఫున చైతన్యం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో విద్యు త్, పంచాయతీరాజ్, నీటిపారుదల, గ్రామీణ నీటిసరఫ రా విభాగాల అధికారులతో మంత్రి నిరంజన్రెడ్డి సమీ క్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ తొమ్మిదేండ్లల్లో రూ.308కోట్లతో వి ద్యుత్ సదుపాయాలను కల్పించామన్నారు. వనపర్తి జి ల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తే.. రైతులను చైత న్యం చేసి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసేలా తనవంతు సహకారం అందిస్తానన్నారు.
దేవరకద్ర నియోజకవర్గం వేములలో 132/33 సబ్స్టేషన్ పనులను వెంటనే పూర్తిచేయాలని, పాన్గల్కు 132/33 సబ్స్టేషన్ మం జూరు చేయాలని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావుకు చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలో 27సబ్స్టేషన్లు మంజూరు కాగా.. 13 వినియోగంలోకి వచ్చాయని, మిగిలిన 14వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 2014 వరకు 15,992 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. తొమ్మిదేండ్లల్లో రూ.92.38 కోట్లతో 19,819 నూతన కనెక్షన్లు ఇచ్చామన్నారు. రూ.71.99 కోట్లతో 6,085 నూతన ట్రాన్స్ఫార్మర్లు, రూ.11.47కోట్లతో 19పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 38, గిరిజన సంక్షేమశాఖ ద్వా రా మంజూరైన 14 గ్రామ పంచాయతీ భవనాల పనులను పూర్తిచేయాలన్నారు. 28ఆరోగ్య ఉపకేంద్రాలు, గ్రామీణ రోడ్లు పనుల్లో వేగం పెంచాలన్నారు. రూ.300 కోట్లతో వనపర్తికి ప్రత్యేకంగా మంజూరైన మిషన్భగీరథ పనులను నెలాఖరుకు పూర్తికావాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీనివాస్రెడ్డి, సీజీఎం భిక్షపతి, ఎస్ఈ నాగేంద్రం, డీఈ నరేందర్, ఏడీఈ యాదయ్య, పంచాయతీరాజ్ ఎస్ఈ శివకుమార్, ఈఈ మల్లయ్య, డీఈలు అశోక్కుమార్, ప్రమోద్రావు, నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటిసరఫరా అధికారులు పాల్గొన్నారు.
తొమ్మిదేండ్లల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం వల్లే పెరిగిన విద్యుత్ డిమాండ్ను తట్టుకోగలుగుతున్నామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమారెడ్డితో వనపర్తి జిల్లా విద్యుత్పై సమీక్షా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినప్పుడు 6,500మెగావాట్లు ఉన్న విద్యుత్ డిమాండ్.. నేడు 15వేల మెగావాట్లకు చేరుకున్నదన్నారు. వనపర్తి జిల్లాలో విద్యుత్కు రూ.630కోట్లు ఖర్చుచేసినట్లు రఘుమారెడ్డి తెలిపారు. కొత్తగా 33/11 36 సబ్స్టేషన్లు, రూ.34.16కోట్లతో 58పవర్ ట్రాన్స్ఫార్మర్లు, రూ.137.70కోట్లతో 12,831వ్యవసాయ ట్రా న్స్ఫార్మర్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 29,428 నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరుకాగా, రూ.143.84 కోట్లతో 33 కేవీ, 11 కేవీ ఎల్టీ విద్యుత్ కనెక్షన్ల నిర్మాణం చేపట్టామన్నారు.
వనపర్తి/అలంపూర్, మార్చి 11: నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల భూసేకరణ 15రోజుల్లో పూర్తిచేయాలని నీటి పారుదలశాఖ అధికారులకు మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే బండ్ల, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భీమా 27, భీమా 19 ప్యాకేజీ కింద అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలన్నారు.
దేవరకద్ర రూరల్, మార్చి 11: చిన్నచింతకుంటకు చెందిన బీజేపీ మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి, సదారాములు, నర్సింహులు, గంగాధర్, పార్వతమ్మ, కాంగ్రెస్ నుంచి రాందాస్, రాజేశ్, శోభారాణి తదితరులు హైదరాబాద్లో శనివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట రాము, నాయకులు పాల్గొన్నారు.