వనపర్తి, నవంబర్ 4 : ‘అభివృద్ధికి అండగా నిలవాలి.. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో తోనే సామాన్యులకు మేలు జరుగుతుంది.. గత ప్రభుత్వాలన్నీ దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి.. వారి బాగోగుల కోసంఆలోచించించి లేదు.. కానీ తెలంగాణ ప్రభుత్వం దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది.. నియోజకవర్గంలో ఎవరూ చేయనంత అభివృద్ధి చేసిన తనను ఆశీర్వదించి, మరోసారి అవకాశం ఇవ్వాలి..అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని మారెమ్మకుంటనుంచి గాంధీనగర్ వరకు శనివారం మంత్రి ఇంటింటి ప్రచారం చేస్త్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. దళితవాడలోని మహిళలు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలికి తామంతా బీఆర్ఎస్కే మద్దతుగా ఉంటామని ప్రకటించారు. వనపర్తిలోని రామాలయం, ఆర్టీసీ కాలనీలకు చెందిన 300మంది నాయకులు, యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సామాన్యులకు మేలు జరిగే విధంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మారెమ్మకుంట నుంచి గాంధీనగర్ వరకు శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్గౌడ్తో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం చేస్త్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ప్రజా సంక్షేమ దిశగా ప్రయాణిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్ కాక అర్హులైన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద రూ.3 వేలను అందించనున్నారని తెలిపారు. అలాగే వచ్చే ఏడాది మే నుంచి పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలన్నీ ఓట్ల కోసమే దళితులను వాడుకున్నారని, వారి బాగోగుల కోసం ఆలోచించిన పాపాన పోలేదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దీంతో ప్రస్తుతం ఈ పథకం కింద లబ్ధిదారులు సొంత ఉపాధిని ఏర్పాటు చేసుకొ ని సగౌరవంగా జీవిస్తున్నారన్నారు.
నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయలేని విధంగా అభివృద్ధి చేసిన తనను ఆశీర్వదించి, మరోసారి గెలిపించాలని కోరారు. రైతుబీమా, రైతు బంధు, వ్యవసాయానికి 24గంటల విద్యుత్తో వ్యవసాయాని పం డుగగా మారిందని, పంట దిగుబడులు పెరిగాయన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారానికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రం, నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే రావాలన్నారు. ఇందుకోసం ప్రతిఒక్కరూ కారుగుర్తుకు ఓటేసీ బీఆర్ఎస్ను గెలిపించాలని అభ్యర్థించారు. దళితవాడలో గుడిలోని అమ్మవారిని ద ర్శించు కు న్నారు. ఈ సందర్భం గా దళిత వాడలోని మహిళలు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగ తం పలికి తామందరం బీఆర్ఎస్కే మద్దతుగా ఉంటామని తెలిపారు. ప్రచారం లో పట్టణ ఎన్నికల సమన్వయకర్త అరుణ్ప్రకాశ్, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ విజయ్కుమార్, కౌన్సిలర్లు సత్యమ్మ, శరవంద, బండారుకృష్ణ, పాకనాటి కృష్ణ, పుట్టపాకుల మహేశ్, కంచెరవి, మీడియా సెల్ శ్యామ్, అశోక్, నాయకులు పరంజ్యోతి, గంధం విజయ్, మందరాము, కృష్ణయాదవ్, రహీం, తిరుమల్, గులాం ఖాదర్, బాలరాజు, మురళీ, శ్రీను, ఉస్మాన్, మునీకుమార్, గౌస్, కురేషి, పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్థ్ధివదేహానికి
నివాళులర్పించిన మంత్రి
జిల్లాకేంద్రంలోని వెంగళ్రావు కాలనీలో నివాసముంటున్న పెద్దమందడి ఎంఈవో జయశంకర్ సతీమణి జయమ్మ శనావారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బాధితుల ఇంటికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి ప్రగాఢ సం తాపాన్ని, వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ మంజుల గోపాల్, కౌన్సిలర్ పుట్టపాకల మహేశ్, వనపర్తి ఎంఈవో శ్రీనివాస్గౌడ్, శివ, చీర్ల విష్ణుసాగర్, ఇతర ఉపాధ్యా య సంఘం నేతలు తదితరులు ఉన్నారు.